India vs Pakistan: క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్..భారత్, పాక్ మధ్య మరో రెండు మ్యాచ్ లు

India vs Pakistan: భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే భారీ స్థాయిలో స్పందన ఉంటుంది. స్టేడియం హౌస్ పుల్ అవుతుంది. ఇక టీవీల ముందు ఇరు దేశాల ప్రజలు అతుక్కునిపోతారు. క్రికెట్ ప్రేక్షకులకు అయితే ఇక ఆ రోజు పండుగే. భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటేనే ఉత్కంఠగా జరుగుతుంది. ఎన్నో భావోద్వేగాల మధ్య జరుగుతుంది. ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుూ ఉంటారు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటేనే చివరి బాల్ వరకు వెళుతుంది. చివరి బాల్ లో గాని ఫలితం ఏంటనేది తెలియదు.. అత్యంత సస్పెన్స్ మధ్య భారత్, పాక్ క్రికెట్ మ్యాచా్ లు జరుగుతూ ఉంటాయి.

అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో భాగంగా ఆదివారం భారత్, పాక్ మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ ఫాన్స్ కు భలే కిక్కిచ్చింది. పాక్ ను భారత్ చిత్తుచేసి టీ20 వరల్డ్ కప్ లో పాక్ ఓడించినదానికి ప్రతీకారం తీర్చుకుంది. కానీ భారత్, పాక్ మధ్య ఆసియా కప్ లో మరో రెండుసార్లు తలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రూప్-ఏలో భారత్ టాప్ లో ఉంది. అయితే భారత్, పాకిస్తాన్ హాంకాంగ్ త మ్యాచ్ ఆడనున్నాయి. హాంకాంగ్ ను రెండు జట్టు ఓడిస్తే సూపర్ 4లో సెప్టెంబర్ 4న భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఉండే అవకాశముంది.

ఇక గ్రూప్ ఏ, గ్రూప్ బిలో భారత్, పాక్ టాప్ లో నిలిస్తే.. సెప్టెంబర్ 11న జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, పాక్ పోటీ పడనున్నాయి. ఏది ఏమైనా ఆసియా కప్ లో భారత్, పాక్ మధ్య మరో మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుందని క్రికెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరి క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే మరో మ్యాచ్ రాబోతుందని ఆశిద్దాం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -