Undavalli Arun Kumar: మోదీ చెప్పిన వాళ్లే ఏపీలో గెలుస్తారు.. వైరల్ అవుతున్న ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు!

Undavalli Arun Kumar:  వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.. అయితే ఎన్నికలు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ మరోవైపు జగన్ కి అందరికీ చాలా ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. నేను సీఎం అవుతాయి నేను సీఎం అవుతాను అంటూ ఒకరిపై ఒకరు పోటీగా నిలుస్తున్నారు. ఇప్పటికే వీరి ముగ్గురు మధ్య పోటీ గట్టిగానే జరుగుతోంది. అధికార పార్టీలో ఉన్న జగన్ వచ్చే ఎన్నికలలో ఎలా అయినా తానే 175 సీట్లలో గెలుస్తాను నమ్మకంతో ఉన్నారు. చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో కనీసం వంద సీట్లు గెలుస్తాను గట్టిగానే చెబుతున్నారు.

ఇకపోతే ఇప్పటికే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రలో పాల్గొంటున్నారు. ఈ సంగతి అటు ఉంచితే తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటర్వ్యూలో చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వచ్చే ఈడాది జరగనున్న ఎన్నికలలో మోడీ ఎవరు చెబితే వారు గెలుస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఉండవల్లి. జగన్ రెడ్డి కావాలి అనుకుంటే పవన్, చంద్రబాబుని సపరేట్గా పోటీ చేయమని చెబుతాడు. ఒకవేళ చంద్రబాబు కావాలి అనుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కలిసి పోటీ చేయమని చెబుతాడు అని తెలిపారు ఉండవల్లి.

అంటే మోడీ ఇలా చెబితే అలా ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. మోడీ చెప్పిన వాళ్ళు గెలుస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పం తో పాటుగా 157 స్థానాలు తనవే అని జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు. మరొకవైపు బాబు కనీసం 100 స్థానాల్లో అయినా గెలిచే చూపిస్తాను. జనసేన టిడిపి కలిస్తే 200 స్థానాలైనా గెలుస్తామంటూ ప్రగల్పాలు పలుకుతున్నారు. మరి ఉన్నది 175 స్థానాలు మిగతా సీట్లను ఎక్కడ నుంచి తెస్తారో ఆయనకే తెలియాలి అంటూ చురకలు అంటించారు ఉండవల్లి అరుణ్ కుమార్.

Related Articles

ట్రేండింగ్

Raghu Rama Krishnam Raju: ఉండిపై ఉడుం పట్టు పట్టిన రఘురామ కృష్ణంరాజు.. అసెంబ్లీలో జగన్ కు వణుకేనా?

Raghu Rama Krishnam Raju: రఘురాం కృష్ణంరాజు కి కూటమి తరపున టికెట్ రాదు అనే భావించిన వైసీపీ వర్గం వారు సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అనూహ్యంగా తెదేపా...
- Advertisement -
- Advertisement -