Undavalli Arun Kumar: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే గెలుస్తారు.. ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Undavalli Arun Kumar: ఆంధ్రప్రదేశ్లో మరో నెల వ్యవధిలో ఎన్నికలు జరగబోతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇలా త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి అధికారంలోకి వచ్చేది తమ పార్టీ నే అంటూ అన్ని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా జగన్ పట్ల అనుకూలంగా వ్యవహరించే ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చే ఎన్నికలలో గెలుపు గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విభజన చట్టం పాస్ అయి పదేళ్లు అయిన సందర్భంగా రాజమండ్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు హయామంలో పోలవరం ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయనే విషయాల గురించి చంద్రబాబు నాయుడు బస్సులు పెట్టి మరి పోలవరం ప్రాజెక్టును అందరికీ చూపించారు.

ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు ఎవరు చూడకుండా పోలీసులను కాపలాగా పెట్టారని ఈయన విమర్శలు చేశారు. ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులు జరగడంలేదని జగన్మోహన్ రెడ్డి వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నిలదీశారు. ఇప్పుడు తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం గురించి మాట్లాడటమే మానేశారని తెలిపారు.

ఇలా జగన్ ప్రభుత్వం గురించి ఆరోపణలు కురిపిస్తూ వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గెలవడం సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి దరిద్రపు పాలన వల్ల ప్రజలు విసిగిపోయారని ఈయన చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి రావడంతో ఆయన గెలుస్తారు అంటూ ఉండవల్లి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -