Undavalli Sridevi: ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. ఏపీలో రాజకీయాలు ఏపీలో నడుస్తున్న హాట్ టాపిక్ లలో ఉండవల్లి శ్రీదేవి గురించి కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు ఆమె పాల్పడినట్లు వైసిపి అధినేతకు అనుమానం రావడంతో వెంటనే ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వైసిపి నాయకులు పార్టీ నేతలు ఆమెను విమర్శించడంతోపాటు ఆమెను టార్గెట్ చేశారు.
సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేస్తారు రెచ్చిపోతున్నారు. ఈ వ్యవహారంపై శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ స్పందించారు. చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మహిళ అనే గౌరవం కూడా లేకుండా బెదిరిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఆమె క్రాస్ వోటింగ్ కీ పాల్పడలేదని 15 కోట్లు తీసుకుని క్రాస్ ఓటింగ్ టీడీపీ కి అనుకూలంగా ఓటు వేసిందనేది అవాస్తవం అంటూ ఆమె భర్త తెలిపారు. రాజకీయాలే మాకు జీవితం కాదు మేము బాగా స్థిరపడిన కుటుంబం అందులోను డాక్టర్స్ కావడం వల్ల పని కూడా ఉంది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలా బురద చల్లుతారని అనుకోలేదు.
వైసీపీ నుండి బయటకు వెళ్లి పార్టీ మీద విమర్శలు చేసిన కోటంరెడ్డి వంటి వారిని ఏమీ చేయలేకపోయినా వైసిపి వాళ్ళు మేము పార్టీకి అనుకూలంగానే ఉన్నా కూడా మీరు మా మీద బురద జల్లి బయటకు నెట్టేశారు. మహిళా అనే గౌరవం కూడా లేకుండా వైసీపీకి చెందిన వాళ్ళు ఫోన్లు చేసి చాలా నీచంగా మాట్లాడుతున్నారు అని తెలిపారు. భార్యను చంపేస్తామని సామూహిక హత్య జ్వరం చేస్తామంటూ ఒక మహిళను అనకూడని మాటలు అన్నారు అని తెలిపారు శ్రీనివాస్. ఇప్పటికే తన భార్య శ్రీదేవి చాలా బాధపడుతోందని తాను తప్పు చేయకపోయినా కూడా పార్టీ నింద వేసి బయటకు పంపించారని ఆమె ఆరోపిస్తుందని తెలిపారు.