Varalaxmi Sarathkumar: నటుడిగా తెలుగుతో పాటు తమిళంలో మంచి గుర్తింపు సాధించిన శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటి వరలక్ష్మీ శరత్ కుమార్. గంభీరమైన గొంతు, అందమైన రూపంలో అందరినీ ఆకట్టుకుంటున్న వరలక్ష్మి.. ఇప్పుడు తెలుగులో మంచి గుర్తింపు సాధించింది. చాలా సినిమాల్లో కీలక రోల్స్ ప్లే చేస్తూ వస్తున్న వరలక్ష్మి.. తన తండ్రి వారసత్వాన్ని కాకుండా సొంతంగా గుర్తింపు సాధించుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె యశోద సినిమాలో కూడా నటించింది.
సరోగసీ మాఫియా నేపథ్యంలో సాగే ‘యశోద’ సినిమాలో సరోగసి సెంటర్ ఓనర్ గా వరలక్ష్మి అద్భుతంగా నటించింది. ఇలా ఎక్కువ విలనిజం, నెగిటివిటి ఉంటే పాత్రలు చేస్తూ వస్తున్న వరలక్ష్మి.. తన జీవితంలో జరిగిన అనేక విషాదకర ఘటనల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లోకి రావడం అంత సులభంగా ఏమీ జరగలేదని వరలక్ష్మి చెప్పింది. ముందు తన తండ్రి సినిమాల్లోకి వద్దని చెప్పారని.. కానీ తర్వాత తల్లి రాధిక ద్వారా ఒప్పించినట్లు వివరించింది.
ఇక తన జీవితంలో ఎన్నో విషాద ఘట్టాలు ఉన్నాయని చెప్పిన వరలక్ష్మి.. తన మీద లైంగిక దాడి జరిగినట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. తన చిన్నతనంలో తనపై లైంగిక దాడి జరిగినట్లు వరలక్ష్మి వివరించింది. తనతో పడుకోవాలని ఓ టీవీ ఛానల్త ఓనర్ అడిగాడని.. తను వెంటనే పోరా పోరంబోకు అంటూ చెయ్య చేసుకోబోతుంటే పారిపోయాడని తెలిపింది. వరలక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు ఇండస్ట్రీలో.. ఎవరా టీవీ ఛానల్ అధినేత అనే చర్చ సాగుతోంది.
ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే వరలక్ష్మి శ్రీ శక్తి పేరుతో ఎన్జీవోను స్థాపించి ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తోంది. అత్యాచారాలకు గురైన వారికి అండగా ఉండటం, గృహహింసకు సబంధించినవారి తరపున కోర్టుల్లో పోరాడటం లాంటివి ఈ ఎన్జీవో చేస్తూ ఉంటుంది. అలాగే మూగజీవాలంటే ఎంతో ఇష్టపడే వరలక్ష్మి.. కొన్ని వేల కుక్కలకురోజూ ఆహారం అందిస్తుందట. సహాయం కోసం తమ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి తాము సహాయం చేస్తామని, అందరికీ న్యాయం చేయాలనే తాము తాపత్రయపడతామని కూడా వరలక్ష్మి వివరించింది.