బిగ్ బాస్ షోతో వితిక షెరు ఎక్కువగా ఫేమస్ అయింది. అంతకు ముందు కొన్ని చిత్రాలు చేసింది. అయినా కూడా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. వరుణ్ సందేశ్ భార్యగా వితికకు నెట్టింట్లో మంచి ఇమేజ్ ఏర్పడింది. భార్యాభర్తలుగా ఈ ఇద్దరి జోడి అందరినీ ఆకట్టుకునేది. ఈ జోడి బిగ్ బాస్ ఇంట్లోకి రావడంతో మరింత ఎక్కువగా ఫేమస్ అయింది. వితిక ఆ క్రేజ్తోనే ఇప్పటికీ సందడి చేస్తోంది.
ఇక తన మల్టీ టాలెంట్ను చూపించేస్తోంది. బిగ్ బాస్ షోతో వితికకు సినిమా ఆఫర్లేమీ రాలేదు. అటుగా వితిక ఏమీ ప్రయత్నాలు కూడా చేయలేదేమో. బుల్లితెరపై యాంకర్, హోస్ట్ అవ్వాలని తన కోరిక అని బిగ్ బాస్ ఇంట్లో చెప్పింది. అలానే బయటకు వచ్చాక కూడా యాంకర్గా మారి తన కోరికను నెర వేర్చుకుంది. ఈటీవీ పాటల కార్యక్రమంలో వితిక సందడి చేసింది.
ఈ మధ్య వితిక, వరుణ్ సందేశ్ ఇద్దరూ కూడా యూఎస్లో తెగ సందడి చేశారు. వరుణ్ వితిక చేస్తోన్న రీల్ వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ కపుల్ అంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా వితిక.. వినాయక చవితి సందర్భంగా పిండి, పసుపుతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసింది. తయారీ విధానాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మామూలుగానే యూట్యూబ్ చానెల్ను రకరకాల వీడియోలతో నింపేస్తుంటారు. ఇప్పుడు వితిక ఈ వీడియోతో ముందుకు వచ్చింది. ఇందుకోసం వితికా ముందుగా పిండి, పసుపును నీటితో కలిపి పిండిలా తయారు చేసింది అనంతరం దాంతో బుజ్జి గణేషున్ని తయారు చేసి. సహజ సిద్ధమైన రంగులు వేసి సింహాసనంపై అధిష్టించింది. అంతేకాదండోయ్.. ఈ ఏడాది పర్యావరణ హిత గణేషుడినే ప్రతిష్టించండి అంటూ వినాయక తయారీ విధానాన్ని పోస్ట్ చేసింది.