Veera Simha Reddy: ఆ తప్పుల వల్లే వీరసింహారెడ్డి ఆకట్టుకోవడం లేదా?

Veera Simha Reddy: సంక్రాంతి సీజన్ నందమూరి బాలకృష్ణ కి బాగా కలిసొచ్చిన సీజన్.తనకి అచ్చోచ్చిన సీజన్ లో వీరసింహారెడ్డి తో అభిమానుల ముందుకు వచ్చారు బాలకృష్ణ. సంక్రాంతి కానుకగా మాస్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి ఈ నెల 12న భారీ ఎత్తున విడుదలయ్యింది. బాక్స్ ఆఫీస్ దగ్గర తన దమ్ము ఏంటో చూపించాడు బాలకృష్ణ ఈ చిత్రం ద్వారా. బాలకృష్ణ చెప్పిన మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది.

వీర సింహా రెడ్డిలో మిస్టేక్స్!

నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి మాస్ హీరోకి ఒక పవర్ఫుల్ పాత్ర ఇస్తే ఎలా ఉంటుందో చూపించింది వీరసింహారెడ్డి. దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమాని నడిపించిన విధానం హీరో పాత్రని మలచిన విధానం అందరినీ ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలు ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు.

వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర స్వైర విహారం చేసింది. మొదటోరోజే 54 కోట్లు కలెక్ట్ చేసింది ఈ చిత్రం. ఇలాంటి సంచలన కలెక్షన్స్ ఉన్నా కూడా వీరసింహారెడ్డి లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇవే గనక లేకపోతే వీరసింహారెడ్డి ఇంకా పెద్ద విజయం సాధించేది అని సోషల్ మీడియాలో పెద్ద టాక్. ఈ సినిమాలో ఉన్న మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

సినిమాలో ఇంత పెద్ద తారాగణం ఉన్నా కూడా హీరోయిన్ శృతిహాసన్ కి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అంటున్నారు. శృతిహాసన్ పాత్ర ని మలచిన తీరు చాలా మందికి నచ్చలేదు. సినిమాలో ఇద్దరు బాలకృష్ణలు ఉన్నారు. పెద్ద బాలకృష్ణ పాత్రకి ఇచ్చిన ప్రాధాన్యత చిన్న బాలకృష్ణ కి దక్కలేదు అంటున్నారు. మలయాళీ భామ హనీ రోజ్ కి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు అనే మాటలు కూడా వినపడుతున్నాయి. ఆమెని కేవలం ఒక పాట కి మాత్రమే పరిమితం చేశారు. అందులోనూ ఆమెకు కొన్ని స్టెప్స్ మాత్రమే ఇచ్చారు. వీటి మీద గనక దర్శకుడు దృష్టి పెట్టగలిగితే వీరసింహారెడ్డి మరింత పెద్ద విజయం సాధించగలిగేది అని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -