Veera Simha Reddy: ఎమోషన్ ఇంటర్వెల్ తో ‘వీరసింహారెడ్డి’.. కథ అదేనట!

Veera Simha Reddy: 2023 సంక్రాంతి పండుగ నందమూరి అభిమానులు చాలా స్పెషల్ కానుంది. నందమూరి బాలయ్య అభిమాని అయిన గోపిచంద్ మలినేని.. ఫ్యాన్ కోణంలో తన ఫేవరెట్ హీరో బాలయ్యను వేరే లెవల్ లో చూపిస్తూ తీసిన సినిమా ‘వీరసింహారెడ్డి’. మాస్ జనాలకు వందకు వంద శాతం నచ్చేలా, నందమూరి బాలయ్య నుండి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలను అందించేలా గోపిచంద్ మలినేని ‘వీరసింహారెడ్డి’ సినిమాను రూపొందించాడు.

 

‘వీరసింహారెడ్డి’ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఈ అంచనాలను రెట్టింపు చేయగా.. జనవరి 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎంతో హైలెట్ గా నిలిచే ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి ఓ లీక్ ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. ఈ లీక్ ప్రకారం సినిమా మీద అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

 

‘వీరసింహారెడ్డి’కి సంబంధించి ఇంటర్వెట్ సీన్ ఇదేనంటూ ఓ లీక్ నెట్టింట వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఈ సినిమాలో
సీనియర్ బాలయ్య పాత్రకు చెల్లి అయిన వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర నమ్మించి కత్తిపోటుతో బాలయ్యను చంపేస్తుందని టాక్. ఈ సీన్ ఎంతో ఎమోషనల్ గా ఉంటుందని, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వల్ల సీన్ విపరీతంగా పండిందని తెలుస్తోంది. ఇంటర్వెల్ గురించి నందమూరి అభిమానులు, సాధారణ ప్రేక్షకులు సైతం పూర్తిస్థాయి సంతృప్తి చెందుతారట.

 

మాస్ లుక్ లో రెండు పాత్రల్లో నందమూరి బాలయ్య ఈ సినిమాలో కనిపించబోతున్నాడని తెలుస్తుండగా.. ఫ్యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా హిట్ అనే టాక్ నడుస్తోంది. అదీ కాక నందమూరి బాలయ్యకు బాగా సెంటిమెంట్ అయిన సింహా వచ్చేలా పేరును ‘వీరసింహారెడ్డి’ అని పెట్టడంతో ఈ సంక్రాంతి హీరో బాలయ్యే అంటూ నందమూరి అభిమానులు అప్పుడు ఉత్సాహం చూపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిలకు డిపాజిట్ రాదట.. బాధగా ఉందట.. జగన్ మొసలి కన్నీరు వెనుక లెక్కలివేనా?

CM Jagan: రాజకీయాలు కుటుంబ సభ్యులను సైతం బద్ధ శత్రువులుగా మారుస్తుందని విషయం మరొకసారి రుజువయింది. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయి బహిరంగంగానే ఒకరిని ఒకరు...
- Advertisement -
- Advertisement -