Vijay Devarakonda: లైగర్ ఎఫెక్ట్ తో జనగణమన నుంచి పక్కకు తప్పుకొనే ఆలోచనలో విజయ్?

Vijay Devarakonda: పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారందరికీ ఈయన బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. ఇలా ఒకప్పుడు వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ అనంతరం వరుస సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీలో ఈయన కూడా ఉన్నారనే విషయాన్ని అందరూ మర్చిపోయారు.

ఇలా పూరి జగన్నాథ్ ను మర్చిపోతున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా మరోసారి తన మార్క్ చూపించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ అనే ఒక డైరెక్టర్ ఉన్నారు అనే విషయం మరోసారి అందరికీ గుర్తు చేసింది. ఇలా ఈ సినిమా మంచి హిట్ కావడంతో అదే ఫ్లోలో ఈయన విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది.సినిమా అన్న తర్వాత హిట్ ప్లాట్లు రావడం సర్వసాధారణం అయితే మనం తీసిన సినిమాలో ఉన్న కంటెంట్ దృష్టిలో పెట్టుకొని మనం ప్రమోషన్ కార్యక్రమాలను చేయాల్సి ఉంటుంది. సినిమాలో కంటెంట్ లేకపోయినా ఎలాంటి ప్రమోషన్స్ చేసిన సినిమాని ప్రేక్షకులు ఆదరించరని లైగర్ నిరూపించింది. ఇలా లైగర్ సినిమా కోసం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ అతిగా ప్రమోషన్స్ చేశారు.

ఈ విధంగా ఈ సినిమాకి అనవసరమైన ప్రమోషన్ చేయటం వల్ల సినిమా అంచనాలను చేరుకోలేకపోవడం తో పలువురు వీరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఎన్నో అంచనాల నడుమ విడుదల అయ్యి డిజాస్టర్ సొంతం చేసుకున్న ఈ సినిమా అనంతరం వీరి కాంబినేషన్ లోనే జనగణమన సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే జనగణమన సినిమా చేయటం వల్ల మరో ప్లాప్ కూడా తప్పదంటూ కొందరు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే విజయ్ టీం అలాగే సన్నిహితులు జనగణమన సినిమా నుంచి తప్పుకొమ్మని విజయ్ దేవరకొండకు సూచనలు చేస్తున్నారట.అయితే విజయ్ దేవరకొండ మాత్రం పూరి జగన్నాథ్ కు కాస్త సమయం ఇచ్చి స్క్రిప్ట్ చాలా పర్ఫెక్ట్ గా ఉండేలా చర్యలు తీసుకోమని చెప్పారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -