Guntur Karam: మహేశ్ ను అలాంటి జబ్బు మనిషిలా చూపించబోతున్నారా.. త్రివిక్రమ్ టాలీవుడ్ పరువు తీశాడుగా!

Guntur Karam: టాలీవుడ్ హీరో మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ అభిమానుల ఆశలు ఎప్పటికప్పుడు ఆవిరి అవుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

తాజాగా కూడా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఒక జబ్బు మనిషిలా కనిపించనున్నారా అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. తన ప్రతి సినిమాలో ఏదో క్యారెక్టర్ ఏదో ఒక రోగంతో చూపించే త్రివిక్రమ్ ఈసారి మాత్రం డిఫరెంట్ గా ఆయన తన సినిమాలో హీరోకి ఒక జబ్బు ఉండే మనిషిలా క్యారెక్టర్ ను డిజైన్ చేశారట. అయితే గుంటూరు కారం సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని చూసుకుంటే మహేష్ బాబు ఎక్కువగా స్మోకింగ్ చేస్తూనే కనిపించాడు . ఈ క్రమంలోనే మహేష్ బాబుకి స్మోకింగ్ అంటే విపరీతమైన పిచ్చి ఉండే మనిషిలా క్యారెక్టర్ డిజైన్ చేశారని అర్థమవుతోంది.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి పెద్ద హీరోకి అటువంటి జబ్బును క్రియేట్ చేసి సినిమాను తెరకెక్కించడం అంటే సాహసం అనే చెప్పాలి. సినిమా రిలీజ్ అయినా తరువాత మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన్ను ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ ని చేసుకున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -