Visakhapatnam: దారుణం.. ప్రియుడు కోసం భర్తను చంపిన భార్య.. ఆపై అలా?

Visakhapatnam: రోజుకి సమాజంలో వివాహేతర సంబంధాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. వివాహేతర సంబంధాల మోజులో పడి భార్యాభర్తలు వారి చక్కటి కాపురాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకొందరు అయితే ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషులు కట్టుకున్న భార్యని హత్య చేస్తున్నారు. అలాగే కొందరు మహిళలు తాళి కట్టిన భర్తను కాదనుకొని వారిని చంపి ఇతర పురుషులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నప్పటికీ ఎటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు.

 

తాజాగా అలాంటి కట్టిన ఒకటి చోటు చేసుకుంది. విశాఖలో మిస్సింగ్ కేసు కాస్త మిస్టరీ హత్యగా మారింది. ప్రియుడు మోజులో పడిన భార్య భర్తను అతి దారుణంగా హత్య చేసి చంపింది. ఏమీ తెలియనట్టుగా భర్త కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అసలేం జరిగిందంటే..
విశాఖ భీమిలి ప్రాంతానికి చెందిన పైడిరాజుకు జ్యోతితో వివాహమైంది. అయితే జ్యోతి అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావుతో కొంత కాలంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కాగా జ్యోతి శ్రీనివాసరావు మధ్య పైడిరాజు అడ్డుగా ఉండడంతో ఎలా అయినా అతని అడ్డు తొలగించుకోవాలనుకుంది జ్యోతి.

 

ఈ క్రమంలోనే భర్తను చంపేందుకు కుట్ర పండింది. ఇక ఇటీవలె పైడిరాజు తినే అన్నంలో నిద్ర మాత్రలు కలిపింది జ్యోతి. పైడిరాజు నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడితో కలిసి గొంతు నులుమి హత్య చేసింది. ఆ తర్వాత అనాధ శవం లాగా స్మశానానికి తీసుకెళ్లి దహనం చేయించింది. తర్వాత ఏమీ తెలియని అమాయకురాలు లాగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. అయితే జ్యోతి ప్రవర్తన పై అనుమానం రావడంతో పైడిరాజు అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు జ్యోతిని వారి స్టైల్ లో విచారించగా అసలు విషయాన్నీ బయటపెట్టింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -