Brahmaji: మీరే టికెట్లు పంపించండి… బ్రహ్మాజీ ట్వీట్ వైరల్!

Brahmaji: విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో మొదటిసారిగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఈ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలోనూ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఆత్రుత నెలకొంది.ఇకపోతే లైగర్ చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి ఆల్ ద బెస్ట్ చెబుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ట్వీట్ చూసిన లైగర్ నిర్మాతలలో ఒకరైన చార్మి ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ ట్వీట్ కి చార్మి రిప్లై ఇస్తూ ఇలా మీరు సినిమా గురించి చేసిన ఈ ట్వీట్ చూసి ఎంతో సంతోషపడ్డాను చాలా ఆనందంగా ఉంది సార్ అంటూనే వెంటనే మీరు టికెట్ బుక్ చేసుకోండి అంటూ రీ ట్వీట్ ఇచ్చారు. ఇలా చార్మి చేసిన ఈ ట్వీట్ పై నటుడు బ్రహ్మజీ స్పందిస్తూ మరొక ట్వీట్ వేశారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ ట్వీట్ చేస్తూ… అసలు మీరేమంటున్నారు చార్మి గారు.. గ్రాడ్ యువర్ టికెట్ అంటున్నారు.. అసలు థియేటర్లు మొత్తం ఫుల్ అయి ఉన్నాయి అంటూ బ్రహ్మాజీ కామెంట్ చేశారు.

ఈ విధంగా చార్మి ట్వీట్ కి బ్రహ్మాజీ రిప్లై ఇవ్వడమే కాకుండా టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉంది మీరే టికెట్లు పంపించండి అంటూ రిప్లై ఇచ్చారు.ఈ క్రమంలోనే ఈ ట్వీట్ పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ అందుకే మేము ముందుగానే బుక్ చేసుకున్నాం అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ప్రతిచోట థియేటర్స్ ఫుల్ అయి ఉన్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి మీరు డబ్బు పంపించండి మేము టికెట్స్ బుక్ చేస్తాము అంటూ కౌంటర్ వేస్తున్నారు.

ఏది ఏమైనా మరికొన్ని గంటలలో లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా గురించి థియేటర్లు ఫుల్ అయి ఉన్నాయని ఈ విధమైనటువంటి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు సైతం ఎంతో సంతోషంలో ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ అటు నార్త్ ఇండస్ట్రీలోనూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ పోస్టర్లు సైతం సినిమాపై అంచనాలు పెంచేసాయని చెప్పాలి.ఈ సినిమా కోసం కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలకు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటుందా లేదంటే అంచనాలను మించి ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -