Taraka Ratna: ఆ ఒక్క మాట వల్ల సంతోషిస్తున్న తారకరత్న భార్య.. ఏం జరిగిందంటే?

Taraka Ratna: నందమూరి తారకరత్న మరణంతో నందమూరి కుటుంబం తీవ్రషోకంలో మునిగింది. 39 ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించడం అనేది అందరిని షాక్ కు గురి చేసింది. బ్రతికున్నంత కాలం హీరోగా అంత పేరు తెచ్చుకోలేకపోయాడు. అంతేకాకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు. అలా అప్పటినుంచి ఆ కుటుంబానికి దూరంగా ఉంటూ.. తన భార్య, పిల్లలను చాలా ప్రేమగా చూసుకున్నాడు.

 

ఇక రాజకీయం వైపు అడుగు పెట్టాలని నిర్ణయించుకోగా ఆ కోరిక కూడా తీరలేకపోయింది. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొనగా ఆ సమయంలో.. తారకరత్నకు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అలా హాస్పిటల్లో 23 రోజులు మృతువుతో పోరాడి చివరికి మహాశివరాత్రి రోజు తుది శ్వాస విడిచారు. ఇక అప్పటినుంచి ఆయన అభిమానులు అసలు తట్టుకోలేక పోయారు.

ఆయన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతుంది. ఆయన ఆలోచనల నుండి బయటికి రాలేకపోతుంది. సోషల్ మీడియాలో ఆయన జ్ఞాపకాలు పంచుకుంటూ బాగా ఎమోషనల్ అవుతుంది. తాజాగా తారకరత్న పెద్దకర్మ చేయగా ఆ కార్యక్రమం కు సిని, రాజకీయ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా పాల్గొన్నారు. అందరూ తారకరత్న చిత్రపటానికి నివాళులు అర్పించారు.

 

ఆ సమయంలో అలేఖ్య రెడ్డి దగ్గరకు చంద్రబాబుతో సహా ఆయన కుటుంబ సభ్యులు వెళ్లి ఆమెకు ధైర్యం ఇచ్చారు. మేమున్నాము అంటూ భరోసా ఇచ్చారు. ఇక తారకరత్న పెద్ద కూతురు నిష్కతో కూడా చంద్రబాబు చాలా సేపు మాట్లాడాడు. ఎటువంటి అవసరం ఉన్న వెంటనే సంప్రదించాలి అని.. అన్ని చూసుకుంటాను అని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఇక చంద్రబాబు ధైర్యం ఇవ్వటంతో అలేఖ్య రెడ్డి సంతోషపడినట్లు తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -