మరో వ్యక్తితో భార్య సరసాలు.. ఫోన్‌లో బూతు పురాణం..!

Wife – Husband :నేటి సమాజంలో మానస సంబంధాలు మంట గలుస్తున్నాయి. మానవ విలువలు, కుటుంబ బాధ్యతలు, సమాజంలో పేరు, వాటంనింటిని వదిలి తమ పంథాలను దగ్గించుకుని రెండు కుటుంబాలకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. అగ్ని సాక్షిగా, వేద మంత్రోచ్ఛరణలో మధ్య రెండు కుటుంబాల బంధువుల సమక్షంలో చేసుకుంటున్న పెళ్లిలను క్షణం ఆలోచించకుండా పెటాకులు చేసుకుంటున్నారు. భర్తకు తెలియకుండా భార్య, ఆమెకు తెలియకుండా భర్త అక్రమ సంబంధాలకు తెర తీస్తున్నారు.

అక్రమ సంబంధాల మోజులో పడి వారి జీవితాలను సర్వనాశనం చేసుకోవడంతో పాటు వారి వారి కుటుంబాలు, పిల్లలను సమాజం తల దించుకునేలా చేస్తున్నారు. ఓ మహిళ ఫోన్‌లో మరో మగాడితో మాట్లాడుతున్నట్లు గమనించిన భర్త ఆమె గొడ్డలితో విచక్షణంగా నరికి చంపిన ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో కలకలం రేపింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం..రాయచూరు జిల్లా లింగసూగురు మండల పరిధిలోని గుడదనాళ గ్రామంలో బెట్టప్ప రేణుకా దంపతులు నివాసముంటున్నారు. ఏడేళ్ల క్రితం వివాహామైన వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

అయితే ఇటీవల భార్య రేణుకా ఓ వ్యక్తితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు గుర్తించాడు బెట్టప్ప. కొన్ని రోజులు గమనించి తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు నిర్దారించుకుని కోపంతో రగిలిపోయేవాడు. ఇదే విషయమై భార్యను మందలించాడు. ఇరువురి మధ్య పలుమార్లు గొడవాలు సైతం జరిగాయి. ఈ క్రమంలో మంగళవారం ఆమె మరోసారి ఫోన్‌లో మాట్లాడుతుండగా గమనించిన బెట్టప్ప కట్టలు తెంచుకున్న కోపంతో భార్య వద్దకు వచ్చి ఇంట్లో ఉన్న గొడ్డలితో దారుణంగా నరికేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయాలైన రేణుకా రక్తపుమడుగులో పడి అక్కడిక్కడే గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలను వదిలింది. అనంతరం బెట్టప్ప నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన సంగతి తెలిపి స్వచ్ఛందంగా లొంగిపోయాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -