భర్త, పిల్లలను వదిలేసిన ప్రియుడితో భార్య జంప్.. తర్వాత ఏమైదంటే?

crime news : ఇటీవల అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోయాయి. వివాహేతర సంబంధాలు చివరికి ప్రాణాలు కూడా తీసేస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయడం లాంటి దారుణాలు తరచూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. పిల్లలు పెట్టిన తర్వాత కూడా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్త, కడుపు పుట్టిన పిల్లలను కూడా వదిలేసి పోతున్నారు భార్యలు. రోజూ ఇలాంటి ఘటనలు మీడియాలో చూస్తూనే ఉన్నాం. అలాగే భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య, పిల్లలను వదిలేసిపోతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి.

తాజాగా కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. భర్త, ముగ్గురు పిల్లను వదిలేసిన ప్రియుడితో కలిసి భార్య వెళ్లిపోయింది. కర్ణాటకలోని తుమకూరులోని పిహెచ్ కాలనీలో సమీపుల్లా, ఆయన భార్య సాహెరా భాను చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో నాలుగేళ్ల క్రితం ప్రియుడితో కలిసి భార్య దుబాయ్ కి వెళ్లింది. అప్పుడప్పుడు కూతుళ్లు, కుమారుడితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండేది. ఈ సందర్భంలో భర్త ఫోన్ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేయగా.. భార్య అతడిని హేళన చేస్తూ ఉండేది.

దీంతో భర్త మనస్థాపంతో ముగ్గురు పిల్లలకు పురుగుల మందు తాగించి అతను కూడా తాగాడు. ఈ ఘటనలో సమీపుల్లా మరణించగా.. స్థానికులు గమనించి పిల్లలను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భార్య అక్రమసంబంధం చివరికి భర్త, పిల్లల ప్రాణాలు తీసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. భార్య వేధింపులు భరించలేకే భర్త పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రియుడితో వెళ్లిన తర్వాత భర్త పట్ల భార్య అనుచితంగా ప్రవర్తించేడదని గుర్తించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -