Adipurush: ఆదిపురుష్ మూవీని బ్యాన్ చేయనున్నారా.. ఏం జరిగిందంటే?

Adipurush: ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా వివాదాలలో చిక్కుకుంది. ఈ సినిమాని నిత్యం వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమా గురించి ఎంతోమంది విమర్శలు చేయగా తాజాగా ఈ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం గమనార్హం. ఈ సినిమా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని అందుకే ఈ సినిమాని బ్యాన్ చేయాలి అంటు కోరుతున్నారు.

 

ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తూ ఆది పురుష్ సినిమా హిందువుల మనోభావాలు సనాతన ధర్మాన్ని తీవ్రంగా కించపరిచే విధంగా ఉన్నాయని, శ్రీరాముడు అందరికీ దేవుడు అయితే ఈ సినిమాలోని డైలాగులు ప్రతి హిందువులను బాధపెట్టాయని పొందుపరిచారు. దేవుళ్ళను ఏకంగా వీడియో గేమ్స్ లో చిత్రాలు లాగా పెట్టారంటూ మండిపడ్డారు. ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఇంతటి అవమానకరమైన చిత్రం లేదని పేర్కొన్నారు.

హిందువులకు శ్రీరాముడిపై రామాయణం పై ఉన్నటువంటి పూర్తి విశ్వాసాన్ని ఈ చిత్రం ద్వంశం చేసిందని, అందుకే ఈ సినిమాని నిలిపివేయాలి అంటూ ప్రధాన మంత్రికి లేఖ రాశారు. భవిష్యత్తులో కూడా ఈ సినిమాని ఓటీటీ లో ప్రదర్శించకూడదు అంటూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామని అలాగే దర్శకుడు ఓం రౌత్ పై కేసు నమోదు చేయాలని ఈ లేఖలో తెలియజేశారు.

 

అయితే ఈ సినిమా రచయిత గురించి,దర్శకుడు గురించి ఇప్పటికి ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.దర్శకుడు కనుక కనపడితే వారిని మరుక్షణమే చంపేస్తామంటూ పెద్ద ఎత్తున వార్నింగ్ ఇస్తున్నారు.ఇలా ఈ సినిమా రోజురోజుకు ఎన్నో వివాదాలలో చిక్కుకుంటుంది. మరి తాజాగా మోడీకి రాసిన లేకపై మోడీ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -