Manchu Manoj: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో భూమా మౌనిక,మంచు మనోజ్ ల పేర్లు కూడా ఒకటి. తాజాగా ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆదివారం మౌనిక స్వగృహంలో ఆమె అక్క, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రిసెప్షన్ ఇవ్వనున్నారు. అక్కచెల్లెళ్ల మధ్య ఆస్తి గొడవలున్నాయి. అయితే మౌనిక వివాహం నేపథ్యంలో గొడవలను పక్కన పెట్టి కుటుంబ సభ్యులందరు ఒకటయ్యారు. మౌనికకు రాజకీయాలలో రాణించాలి ఆశ బలంగా ఉంది అన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా గతంలో ఆమె తన తల్లిదండ్రుల కోసం ఆళ్లగడ్డ అలాగే నంద్యాల నియోజకవర్గాలలో ప్రచారం కూడా చేసింది.
అలాగే నంద్యాల ఉప ఎన్నికలో తన సోదరి అఖిల ప్రియ, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు చానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. మౌనిక చక్కగా మాట్లాడతారు అనే పేరును కూడా తెచ్చుకుంది. ఇకపోతే భూమా మౌనిక ప్రస్తుతం మంచు ఫ్యామిలీకి కోడలు అన్న విషయం తెలిసిందే. దాంతో ఆమె కు బలం తోడైంది. అంతే కాకుండా మౌనిక రానున్న రోజుల్లో భర్త మంచు మనోజ్తో కలిసి ఆమె నంద్యాల జిల్లాలో సరికొత్త రాజకీయ ప్రస్థానం మొదలు పెడతారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే నంద్యాలలో మొదలు పెట్టినుందా లేకపోతే ఆళ్లగడ్డలోనా అన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు.
కాగా అఖిల ప్రియ భర్త భార్గవ్రామ్తో పోల్చుకుంటే, మంచు మనోజ్ బలమైన కుటుంబ, రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తి. దీంతో తమ రాజకీయ ప్రస్థానం గురించి ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. కాగా ప్రస్తుత రాజకీయాల్లో యువతకు అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. మంచు కుటుంబానికి ఇటు వైఎస్ జగన్, అటు చంద్రబాబు కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో చూడాలి మరి.