Young tiger NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై వైసీపీ దాడి.. ఏం జరిగిందంటే?

Young tiger NTR: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి సెలబ్రిటీలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.ఇలా ఎంతోమంది హీరోలకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా పెద్ద ఎత్తున ఈ హీరోల అభిమానుల మధ్య గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా తరచూ గొడవలు పడుతూ విధ్వంసం కూడా సృష్టిస్తుంటారు కానీ హీరోలు మాత్రం సదరు హీరోల పట్ల చాలా సన్నిహితంగా స్నేహభావంతో మెలుగుతూ ఉంటారు.

ఇదే విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ అందరూ మంచిగా ఉండాలని చెప్పినప్పటికీ అభిమానుల మధ్య మాత్రం మా హీరో తోపు అంటే మా హీరో గొప్ప అంటూ గొడవలు జరుగుతూనే ఉంటాయి.ఇలా హీరోల అభిమానుల మధ్య గొడవలు రావడం సర్వసాధారణం కానీ ఒక హీరో అభిమానులపై మరొక పార్టీ కార్యకర్తలు దాడి చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ అభిమానులపై వైఎస్ఆర్సిపి కార్యకర్తలు దాడి చేయడం సంచలనంగా మారింది.

 

సూళ్లూరుపేటలోని రాఘవయ్యపేటకు చెందిన ఎన్టీఆర్ అభిమానులు వెంకటేష్ యాదవ్ సునీల్ యాదవ్ పై వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. వెంకటేష్,సునీల్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ కి వీరాభిమానులు వీరిద్దరూ కలిసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలలో కూడా పాల్గొనేవారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరిపై వైఎస్ఆర్సిపి నాయకులు దాడి చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

 

కొద్దిరోజుల క్రితం వెంకటేష్ పై వైసీపీ నాయకులు దాడి చేయగా శనివారం సాయంత్రం సునీల్ యాదవ్ పై కూడా దాడికి దిగారు. సునీల్ యాదవ్ దారిన నడుచుకుంటూ వెళుతుండగా వైఎస్ఆర్సిపి అభిమానులతో తనకు గొడవ జరిగింది.ఈ తోపులాటలో సునీల్ యాదవ్ కింద పడి గాయాలు పాలయ్యారు. అలాగే ఇంటికి వెళ్లినటువంటి సునీల్ పై వైఎస్ఆర్సిపి కార్యకర్తలు దాదాపు పది మంది వరకు వెళ్లి సునీల్ వెంకటేష్ యాదవుల పై కత్తి, రాడ్లతో దాడికి దిగారు. దీంతో వెంకటేష్ యాదవ్ తీవ్రంగా గాయపడటంతో తనని వెంటనే చికిత్స నిమిత్తం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో సునీల్ కూడా తీవ్రంగా గాయపడటంతో పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -