Pawan Kalyan: పవన్ సభలో కత్తులతో కలకలం.. ఏకంగా పోలీసులపై దాడి చేసే ప్రయత్నాలా?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈయన కూటమిలో భాగంగా జనసేన పార్టీకి 21 సీట్లు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఈ 21 స్థానాలలో మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పోటీ చేసే చోట కూడా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల భీమవరంలో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ భీమవరం సభలో భాగంగా పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సిపి నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ ఉండగా ఇద్దరు వ్యక్తులు కత్తులతో కనిపించి తీవ్ర కలకలం సృష్టించారు. పవన్ కళ్యాణ్ సభలో భాగంగా బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు వేరువేరుగా ఇద్దరు అనుమానితులను గుర్తించారు వారిని చెక్ చేయగా వారి వద్ద కత్తులు కనిపించటం గమనార్హం.

ఇలా ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. అయితే వారిపై యువకులు ఎదురు దాడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించారు. అయితే వారి వద్ద కత్తులు ఉండటంతో కొంత ఆందోళన కరంగా మారింది. ఈ ఇద్దరు యువకులు భీమవరం బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి ఈ ఇద్దరు యువకులు కత్తులతో ఎందుకు పవన్ కళ్యాణ్ సభ ప్రాంగణం వద్దకి వచ్చారు అన్నది ఆసక్తికరంగా మారింది. బహుశా ఈ ఇద్దరు జోబు దొంగలా లేకపోతే ఎవరిపైన ఈ కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నాలు చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -