NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇంతకు మించి మరో అవమానం ఉంటుందా?

NTR: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది విడుదల అయిన ఆర్aఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

కాగా ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 20 ఏళ్ల కింద ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు వెయ్యి థియేటర్ లలో ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రీ రిలీజ్ సినిమాలలో ఖుషి మూవీ హైయెస్ట్ కలెక్షన్లను సాధించిందని కొంతమంది చెబుతుండగా కాదు ఎన్టీఆర్ సింహాద్రి సినిమా హైయెస్ట్ కలెక్షన్లను సాధించిందని మరి కొందరు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ పుట్టినరోజున ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించగా తర్వాత రోజుల్లో మాత్రం కలెక్షన్లు తగ్గాయి. రెండో రోజున కేవలం 16 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు మాత్రం కేవలం 7 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ కు 7 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ లు ఎన్టీఆర్ కు ఇంతకు మించిన అవమానం మరొకటి లేదని చెప్పవచ్చు. కాగా రాబోయే రోజుల్లో తారక్ నటించిన మరిన్ని సినిమాలు రీ రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -