Mahesh: మహేష్ బాబును ఫుల్ గా వాడేస్తున్న ఆ ఛానల్.. అసలు మ్యాటర్ ఏంటంటే!

Mahesh: టాలీవుడ్ ప్రపంచానికి ప్రిన్స్ మహేష్ బాబు పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రాజకుమారుడు సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఆ తర్వాత పలు సినిమాలో నటించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇక మహేష్ బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. దాదాపు ఐదు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం మహేష్ బాబు సొంతం.

ఇలా ఇండస్ట్రీలో మహేష్ బాబు కుర్ర హీరోలతో సమానంగా వరుస సినీ ఆఫర్లను తన సొంతం చేసుకుంటున్నాడు. ఇక ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను మారో స్థాయిలో ఆకట్టుకున్నాడు మహేష్. ఇదిలా ఉంటే జీ తెలుగు ఛానల్ మహేష్ బాబును మరో స్థాయిలో వాడేస్తుంది. ఈ వాడకం వెనక ఎంతో పెద్ద డీల్ ఉన్నట్లు మహేష్ బాబు అభిమానులు అనుకుంటున్నారు.

ఇటీవల మహేష్ బాబు తన కూతురు సీతారను తీసుకుని జీ తెలుగులో జరిగే డ్యాన్ షో కి వెళ్ళాడు. ఇలాంటివన్నీ చాలామంది సెలబ్రేటీలకు కామన్. కానీ ఒక సంవత్సరం వరకూ జీ తెలుగు ఛానల్ కు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లో మహేష్ బాబు పాల్గొనేలా జీ తెలుగు ఛానల్ డీల్ చేసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ డీల్ కు తగ్గట్టే ప్రస్తుతం అన్నీ జరుగుతూ వస్తున్నాయి. తాజాగా పడమటి సంధ్యారాగం అనే సీరియల్ జీ తెలుగులో వెలుగులోకి వచ్చింది. కాగా ఈ సీరియల్ మహేష్ బాబు స్వయంగా ప్రమోట్ చేశాడు.

ఇక మహేష్ వెంట తన కూతురు సితార కూడా ప్రకటనలో పాల్గొంటుంది. కాగా సెప్టెంబర్ 19న ఈ సీరియల్ ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక ఈ విధంగా జీ తెలుగు మహేష్ బాబుని ఒక రేంజ్ లో వాడేసుకుంటుందని మహేష్ బాబు అభిమానులు అనుకుంటున్నారు. ఇక మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా త్వరలో రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 15న ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -