Rs 2000 Note Exchange: మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్.బి.ఐ రెండుసార్లు నోట్లు మార్పిడి చేసిన సంగతి మనకు తెలిసిందే. 2017 వ సంవత్సరంలో పూర్తిస్థాయిలో నోట్లన రద్దు చేస్తూ కొత్త నోట్లను విడుదల చేశారు. ఈ క్రమంలోని 2000 రూపాయల నోట్లను విడుదల చేశారు. అయితే తాజాగా మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లో రద్దు చేసిన విషయాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
ఎవరి దగ్గరైనా ₹2,000 నోట్లు ఉంటే సెప్టెంబర్ 30 తేదీల్లోగా వాటిని సదరు బ్యాంకులలో మార్చుకోవాల్సి ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది ఆయన పటికి ఈ రెండు వేల రూపాయల నోట్లు ఇప్పటికీ జమ కాలేదని తెలుస్తోంది. కొంతకాలం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లో ప్రింట్ చేయడం ఆపివేసింది. అయితే ఎన్ని నోట్లను ప్రింట్ చేశారు అనే లెక్కలు ఆర్బిఐ వద్ద తప్పనిసరిగా ఉంటాయి .
నోట్లు రోడ్లు రద్దు చేసిన తర్వాత ఎన్ని తిరిగి బ్యాంకుకు చేరుకున్నాయనే విషయాలను కూడా లెక్కిస్తున్నారు అయితే ఇప్పటివరకు కేవలం 93% మాత్రమే రికవరీ అయింది కాని మిగతా ఏడు శాతం రికవరీ కాలేదని అధికారులు తెలియజేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం సెప్టెంబర్ 30 తేదీ గడువు ముగిసిపోవడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంకా బ్యాంకుకు సుమారు 24 వేల కోట్ల రూపాయలు రెండు వేల రూపాయల నోట్లు రావాల్సి ఉందని అధికారులు లెక్కలు చెబుతున్నారు.
మరి నాలుగు రోజుల గడువుకి ఈ స్థాయిలో రికవరీ అయ్యేనా అంటే అది ఆ సాధ్యం అని చెప్పాలి. ఇలా ఈ పెద్ద మొత్తంలో డబ్బు బ్లాక్ మనీగా కొందరు వద్దే ఉండిపోయిందని ఇలా నోట్లు రద్దు చేసిన కూడా ఇలాంటి నల్ల కుబేరులకు పెద్దగా నష్టాలు ఏమీ రాలేదని తెలుస్తుంది అలాగే మరికొందరికి వీటిపై అవగాహన లేక 2000 రూపాయల నోట్లో వారి వద్ద కూడా ఉంచుకొని ఉంటారని అధికారులు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై చివరికి రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సిందే.