RBI: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా 2000 వేల నోట్లను ప్రవేశ పెట్టిన బీజేపీ నేతృత్వంలోనే మోడీ ప్రభుత్వం.. ఆ నోట్లను రద్దు కూడా రద్దు చేసేందుకు ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేసినట్లు కూడా తెలుస్తోంది.
ఆరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వెయ్యి, ఐదు వందల నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్త ఐదు వందల నోట్లు అలానే రెండు వేల నోట్లను కేంద్రం వినియోగంలోకి తెచ్చింది. అయితే గత కొంతకాలం నుంచి 2000 నోటు మార్కెట్ లో కనబడటం లేదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు వేల నోట్ల చలామణిపై మంగళవారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
అయితే కొంతకాలం నుంచి 2 వేల నోట్లు మార్కెట్ లో కనిపించడం లేదని ప్రజలు పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు.
అలానే ఏటీఎంలో సైతం రెండు వేల నోట్లు రావడంలేదని మరికొందరు అంటున్నారు.అలానే సెలబ్రిటీలు సైతం రెండు నోట్లు కనపడటం లేదని పలు ఇంటర్యూల్లో తెలిపారు.తాజాగా రెండు వేల నోట్లపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఏటీఎంలో రెండు వేల నోట్లు ఉంచడం అనేది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు.
ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది మార్చి నాటికి రూ.500, రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ.27,057 లక్షల కోట్లని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇంత భారీ మొత్తంలో 2000 నోట్లు ఉన్నాయని చెప్పిన ఆమె.. ఏటీఎంలలో ఈ నోట్లు నింపకూడదని బ్యాంకులకు కేంద్రం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పారు.