Prabhas: మారుతి మూవీ కథ మారిందట.. ఈ విచిత్రమైన ప్రయోగాలు అవసరమా ప్రభాస్!

Prabhas: తెలుగు ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ చాలా ఎక్కువ సినిమాలకు దక్కే క్రేజ్ ప్రభాస్ సొంతం. రాజమౌళి దయతో ఒక్కసారిగా ప్రభాస్ తన టాలెంట్ కనపరిచి వరల్డ్ వైడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో వరుస షెడ్యూల్ తో బిజీగా ఉన్నాడు.

ఇక గతంలో మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని వార్తలు బాగా వచ్చాయి. కానీ ఇంతవరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీనికి కారణం ప్రభాస్ చేతిలో సలార్ , ప్రాజెక్టు కే సినిమాలు ఉన్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మారుతి రాసుకున్న కథలో చాలా మార్పులు ఉన్నాయి. నిజానికి ప్రభాస్ తో మారుతి సినిమా అనగానే ప్రభాస్ అభిమానులు భయపడ్డారు.

మారుతీ కథలంతా మీడియం రేంజ్ లో ఉంటాయి. అంతేకాకుండా ప్రభాస్ తో ఒక హర్రర్ కామెడీ కథ రాసుకున్నాడు. హర్రర్ సినిమాలు ఎవరూ చూడని ఈ రోజుల్లో ప్రభాస్ తో ఈ సినిమా ఏంటని ప్రభాస్ అభిమానులు అంతు పట్టలేని విధంగా ఆలోచించారు. అయితే ఇప్పుడు ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వచ్చే కథ మొత్తం పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తుంది. హర్రర్ కామెడీ చిత్రాన్ని.. క్రైమ్ కామెడీ చిత్రంగా మార్చేసినట్లు తెలుస్తుంది.

ఈ సినిమా వజ్రాల దోపిడీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణం ఈ సినిమాలో భారీ స్థాయిలో మార్పులు ఉండడమేనట. ఇక నవంబర్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన కొందరు నెటిజన్లు పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ వెలుగుతున్నప్పుడు ఇటువంటి విచిత్రమైన ప్రయోగాల అవసరమా అన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -