Prabhas: ఇంజక్షన్లతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న ప్రభాస్.. షాకైనా నిజమేనంటూ?

Prabhas: ప్రభాస్ ఆది పురుష్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. కాగా ఈ సినిమా టీజర్ ఆదివారం అయోధ్యలో విడుదల చేశారు. అయోధ్యలో శ్రీరాముడు కాలు మోపిన కారణంగా ఈ టీజర్ ను అయోధ్యలో విడుదల చేశారు.

ఇక ఆది పురుష్ టీజర్ విడుదల నేపథ్యం లో ప్రభాస్ అయోధ్యకు వచ్చాడు. అక్కడ మెట్లు దిగడానికి ప్రభాస్ ఇబ్బంది పడుతున్న వైనం తన అభిమానులంతా గమనించారు. ప్రభాస్ అటు ఇటు ఇద్దరి సహాయం తీసుకొని నడిచాడు. ఇది గమనించిన ప్రభాస్ అభిమానులు అతడిని చూసి ఆవేదన చెందుతున్నారు. ప్రభాష్ కు మోకాలి సమస్య ఉందని తెలుసు కానీ తగ్గిపోయిందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు అసలు విషయం బయటపడింది.

ప్రభాస్ బాహుబలి సినిమాలో నటించడం వలన అతడి రెండు మోకాళ్ళు దెబ్బ తిన్నాయి. వాటికి సర్జరీ చేపిస్తే మెరుగుపడతాయని తెలిసింది. కానీ ప్రభాస్ ఈలోగా సర్జరీ అవాయిడ్ చేయడానికి, సర్జరీ లేకుండా తగ్గిపోవడానికి ప్రభాస్ ఇంజక్షన్లు వాడుతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ప్రభాస్ ఇంజక్షన్లు కూడా ఇటలీ నుంచి పొందుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు.

ప్రభాస్ ఈ సమస్య నుంచి ఎప్పుడు బయట పడతారని ఆలోచనలు చేస్తున్నారు. మరి ఈ విషయం గురించి ప్రభాస్ విధంగా స్పందిస్తాడో ఎదురుచూడాల్సి ఉంది. మరి త్వరలో అయన ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా టీజర్ ఆదివారం రోజున విడుదలైంది. ఈ సినిమా టీజర్ చూసిన ప్రభాస్ యాంటీ అభిమానులు ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. మరి బాహుబలి తర్వాత నుంచి వరుస ప్లాప్ లు అందుకుంటున్న ప్రభాస్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -