Prabhas: తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన నటుడు హీరో ప్రభాస్. ఆయన తనదైన నటనతో వరల్డ్ వైడ్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్తో నటించడానికి టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కాదు.. బాలీవుడ్ తారలు సైతం ఆశపడుతున్నారు. ప్రభాస్కున్న క్రేజ్, రేంజ్కు అతనితో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోయిన్లు తారసపడుతున్నారు. కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ‘ఈశ్వర్’ సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీకి తెరంగేట్రం చేశాడు.
మొదటి సినిమాతోనే ప్రభాస్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. ప్రభాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. ఇక ప్రభాస్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన కామెడీ స్టైల్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ప్రభాస్ నటించిన ‘మున్నా, బిల్లా, రాఘవేంద్ర’ వంటి వరుస సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ‘వర్షం’ సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు.
రాజామౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘ఛత్రపతి’. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రేక్షకులను ఎంతగానో నిరాశపర్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించారు. ఈ సినిమాతో కంగనా రనౌత్ జాతకం మారిపోయిందనే చెప్పాలి మరి.
ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ కంగనా రనౌత్ కోరిక తీరిందనే చెప్పాలి. ఆమెకి ఎంతో ఇష్టమైన కారును కొనుకున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి నటించిన ఈ సినిమా గురించి అప్పట్లో ఓ వార్త ప్రచురితమైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్కి కంగనాకు మధ్య చిన్న గొడవ జరిగినట్లు వార్తలు వినిపించాయి. ఈ గొడవతో ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారట. ఇద్దరూ ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉండేవారని, అలా సినిమా పూర్తి చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు.