KCR: టైగర్ అంటూ కేసీఆర్ మనవడు పోస్ట్.. అప్పుడే ఈ మాటలు అవసరమా అంటూ ట్రోల్స్!

KCR: రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రపంచం నలమూలలా ఏ విషయం జరిగినా కూడా నిమిషాల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది. వైరల్, క్రైమ్, పొలిటికల్, సినిమా ఇలా అన్ని సంఘటనలకు సంబంధించిన విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఏదైనా ఒక వార్త కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటే అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అంటే చాలు ఆ వార్తలో ఉన్నవారు రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా కూడా మారిపోతుంటారు.

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ కి చెందిన వారు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు చేసిన స్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ వ్యాపారవేత ఆనంద్ మహీంద్రా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో రకమైన పోస్ట్ లు చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో కోపంగా చూస్తున్న ఒక పులి బొమ్మను పోస్ట్ చేసి మీ ఇంట్లో ఇలాంటి వ్యక్తి ఎవరంటూ ప్రశ్నించాడు.

అలాగే ఈ పులి బొమ్మ మీద నేను దేనికి స్పందించను.. కానీ నమ్ము.. ప్రతిదాన్ని గమనిస్తూంటాను అనే క్యాప్షన్‌ కూడా జోడించాడు. ఇక ఈ ట్వీట్‌ పై నెటిజన్స్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవడు హిమాన్షు కూడా స్పందించాడు. ఆ ట్వీట్ పై హిమాన్షు స్పందిస్తూ.. మా కుటుంబంలో ఈ పులిలా ఉండే వ్యక్తి తాత కేసీఆర్‌ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం హిమాన్షు చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కేసీఆర్‌ అంటే పులే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -