Tarak: బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమా హీరోగా టాలీవుడ్కు పరిచయమయ్యారు. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నంబర్.1’ సినిమా చేశారు. ఈ సినిమా మంచి హిట్ టాక్తో దూసుకెళ్లింది. ఎన్టీఆర్ యాక్టింగ్కు మంచి మార్కులు పడ్డాయి. ‘ఆది, సింహాద్రి, ఆంధ్రావాలా, రాఖీ’ సినిమాలు కమర్షియల్ హిట్గా నిలిచాయి. ఆ తర్వాత మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో ‘యమదొంగ’ సినిమా చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యముడి పాత్రలో కనిపించారు. పౌరాణిక పాత్రలో ఎన్టీఆర్ ఇరగదీశారు. ‘కంత్రి, అదుర్స్, బృందావనం, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ’ సినిమాలతో మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ టాలీవుడ్లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేశారు. కొమురంభీమ్ పాత్రలో ఎన్టీఆర్ యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. ఈ సినిమా బిగ్గేస్ట్ హిట్ అయింది.
వరల్డ్ వైడ్ భారీగా వసూళ్లు రాబట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. దీంతో అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సంస్థ ఎన్టీఆర్తో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. రూ.600 కోట్లతో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్తో మూడు సినిమాలు చేయాలని ఎన్టీఆర్ను సంస్థ కోరిందని సమాచారం. ఒక్కో సినిమాకు రూ.200 కోట్ల చొప్పున పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ డీల్ కుదుర్చుకున్నట్లయితే.. ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకునే హీరోగా ఎన్టీఆర్ రికార్డు సృష్టించనున్నారు.