Shruti Haasan: శృతి షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పు చేయనంటూ?

Shruti Haasan: సినిమా అనే రంగుల ప్రపంచాన్ని మన ముందుకు తీసుకురావడానికి ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు. టెక్నికల్ టీం దగ్గరి నుండి నటీనటుల వరకు అందరూ మనకు ఆనందం పంచడానికి తమవంతు కృషి చేస్తుంటారు. అయితే మన కంటికి అద్భుతంగా అనిపించే కొన్ని సీన్లు.. తీయడం చాలా ఇబ్బంది కరంగా కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితినే హీరోయిన్ శృతి హాసన్ ఎదుర్కొందట.

 

కమల్ హాసన్ కూతురిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన శృతి హాసన్.. వరుసగా తెలుగులో చిరంజీవి, బాలయ్యలతో సినిమాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తుండగా.. బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ సినిమాలో హీరోయిన్ గా శృతి చేస్తోంది. అయితే చిరంజీవితో చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ‘శ్రీదేవి’ పాట బాగా హిట్ అయింది.

 

ఈ పాటలో చిరంజీవితో శృతి హాసన్ ఎంతో అందంగా కనిపించడంతో పాటు పాట కూడా అాద్భుతంగా వచ్చిందనే టాక్ ఉంది. దీంతో ఈ పాట యూట్యూబ్ లో కూడా బాగా హిట్ అయింది. అయితే ఈ పాట గురించి శృతి హాసన్ తను అనుభవించిన బాధను చెప్పుకొచ్చింది. ఈ పాటను మైనస్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలో తీశారని.. చీర కట్టుకొని డ్యాన్ప్ అవసరమా అని అనుకున్నట్లు శృతి తెలిపింది. చూడటానికి బాగున్నా, చేయడం ఇబ్బంది అని వివరించిన శృతి హాసన్.. సెట్లో ఎంజాయ్ లేదు అని చెప్పుకొచ్చింది.

 

ఇలాంటి తప్పు జీవితంలో చేయను అని చెప్పిన హీరోయిన్ శృతి హాసన్.. ‘ఇలాంటి పాటల్ని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కాకపోతే తెరకెక్కించడం మాత్రం చాలా కష్టం. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో స్టెప్పులేయడం అవసరమా అనిపించింది? ఇంకెప్పుడు ఇలాంటి వాతావరణంలో పని చేయను’ అని చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -