Liger: లైగర్ సినిమాకి ఫస్ట్ రివ్యూ ఇచ్చిన ఉమైర్ సంధు!

Liger: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కి ఎన్నో అంచనాల నడుమ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లైగర్. ఈ సినిమా ద్వారా పూరి జగన్నాథ్,విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో వారి సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా నిర్మించారు.

ఇక ఈ సినిమాలు విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ క్యారెక్టర్ లో నటించిందని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. ఇలా ట్రైలర్ టీజర్ పోస్టర్ల ద్వారా సినిమాపై భారీ అంచనాలను పెంచారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది.

ఇక ఈ సినిమా కోసం చిత్ర బృందం దాదాపు మూడు సంవత్సరాలు పాటు ఎంతో కష్టపడి సినిమాని చేయడమే కాకుండా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ సౌత్ నుంచి నార్త్ వరకు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకి.. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ‘లైగర్’ ఫస్ట్ రివ్యూను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు.

ఇక ఈయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ సినిమా రివ్యూ గురించి తెలియజేస్తూ.. లైగర్ సినిమా విజిల్స్ వేయించే మాస్ ఎంటర్టైన్మెంట్ అంటూ తెలియజేశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ వన్ మేన్ షో గా చేశారని అన్ని రకాలుగా తన అభినయంతో అందరి మనసు దోచుకున్నాడు. కళ్ళు చెదిరే యాక్షన్ స్టంట్స్, అదిరిపోయే డైరెక్షన్.. రమ్యకృష్ణ సర్‌ప్రైజ్ ప్యాకేజ్ అంటూ ఈయన ప్రతి ఒక్క విషయం గురించి ఎంత స్పష్టంగా వివరించారు. అయితే కథ, స్ర్కీన్ ప్లే యావరేజ్‌గా ఉన్నాయి’.. అంటూ ట్వీట్ చేశారు.

ఈ విధంగా లైగర్ సినిమా గురించి ఉమైర్ సందు ఇలా పాజిటివ్ రివ్యూ ఇవ్వడం చేత అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విజయం పై విజయ్ దేవరకొండ సైతం ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు మనకు ప్రమోషన్ కార్యక్రమాలలోనే అర్థమైంది. ఇకపోతే ఈ సినిమాకి ఓ మై సందు రివ్యూ ఇవ్వడంతో తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటుందని అభిమానులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి ఉండాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -