Kodali Nani: వైరల్ అవుతున్న కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!

Kodali Nani: ఏపీ రాజకీయాలు తారాస్థాయిలో నడుస్తున్నాయి. మెున్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి మరింత దూకుడుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపణలు చేసుకుంటాన్నారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవటం రాజకీయంగా బలాన్ని ఇచ్చింది. దీనికి తోడు ఎమ్మెల్యే స్థానాల ఎమ్మెల్సీల్లోనూ ఒక టీడీపీ అభ్యర్థి గెలిచారు.
అయితే దీనిపై తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ గత మూడు నెలల నుంచి దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. నెల్లూరు రెడ్లు రెబల్ గా మారటం, ఆ పార్టీకి ఏమాత్రం మింగుడు పడటం లేదు. కయ్యాని కాలు దువ్వుతున్న రెడ్లకు, మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తోడు అయ్యారనే ప్రచారం నడుస్తోంది. ఇందులో బాగంగానే తమకి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చంద్రబాబు సహా టీడీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే కొడాలి నాని కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

చంద్రబాబు, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. ఏ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోని ఎవరితో టచ్‌లో ఉన్నా, జగన్‌కు వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఎన్నికల వేళ లీడర్లెవరైనా ప్రజలతో టచ్‌లో ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

ఈ క్రమంలోనే బాలయ్యకూ చురకలంటించారు కొడాలి నాని. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జగన్‌పై బాలయ్య చేసిన కామెంట్లకు స్ట్రాంగ్‌ కౌంటర్లే ఇచ్చిపడేశారు. ఎవరు కామెంట్‌ చేసినా సరైన నాయకుడు కౌంటరిస్తే ఆ కిక్కే వేరు కదా. చూడాలి మరీ టీడీపీ నుంచి రియాక్షన్.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -