Chittoor: ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్.. అసలేం జరిగిందంటే?

Chittoor: జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాడితే జీవితాలను నాశనం చేయడంతో పాటు మన ప్రాణాలను కూడా పొట్టన పెట్టుకుంటాయి. మొన్నటికి దోమలు ఎక్కువగా ఉన్నాయని ఒక కుటుంబం మస్కిటో కాయిల్ ని వెలిగించుకుని పడుతుంది. దురదృష్టవశాత్తు ఆ మస్కిటో కాయిల్ పక్కనే ఉన్న రగ్గులకు అంటుకొని గది మొత్తం ఆ పొగ నిండుకోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.

ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, మార్లపల్లిలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా మార్లపల్లిలో మస్కిటో కాయిల్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగి నిరంజన్ అనే 46 ఏళ్ళ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. మార్లపల్లికి చెందిన నిరంజన్ దోమలు ఎక్కువగా ఉన్నాయని, సోమవారం రాత్రి కాయిల్ వెలిగించి నిద్రపోయాడు.

ఈ క్రమంలో మస్కిటో కాయిల్ ద్వారా అకస్మాత్తుగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం సంభవించి ఇంటి మొత్తానికి మంటలు వ్యాపించాయి.

 

నిద్రలో ఉన్న నిరంజన్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యాడు. అయితే ఉదయాన్నే ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలు, పొగలను అదుపుచేసి లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే నిరసంజన్ డెడ్ బాడీ సగం కాలిపోయి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో నిరంజన్ ఒక్కడే ఒంట్లో ఉండటం వల్ల అతను ఒక్కడే అగ్గిలో కాళి దహనం అయ్యాడు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -