Warning Letter: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేస్తాము అంటూ వచ్చిన బెదిరింపు లేఖ కలకలం రేపుతోంది. కాగా ఈ నెల ఏప్రిల్ 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో పర్యటించనున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కేరళ రాష్ట్రానికి మోడీ వస్తే ఆత్మహృతి దాడులకు పాల్పడతాము అంటూ కేరళ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చెందిన కొందరు దుండగులు మలయాళంలో లేఖను రాశారు. అది కాస్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎర్నాకులం వాసి జానీ నడుముత్తమిల్ పేరుతో ఈ లేఖ వచ్చింది.
కాగా ప్రధాని నరేంద్ర మోడీకి బెదిరింపు లేఖ రావడంతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా మరోవైపు ఈ లేఖలో పేరున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అయితే మోడీకి తన పేరుతో ఎవరో పంపారని తాను మాత్రం ఎలాంటి లేఖ రాయలేదని సదరు వ్యక్తి స్పష్టం చేశాడు. ఈ క్రమంలో లేఖపై మిస్టరీ వీడలేదు. ఈ లేఖ ఏప్రిల్ 17వ తేదీనే కేరళ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరిందని పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆ లేఖను పోలీసు ముఖ్య అధికారికి కేరళ బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కే సురేంద్రన్ తెలిపారు.
ఏప్రిల్ 24 నుంచి ప్రధానిమోడీ రెండు రోజుల పాటు కేరళలో పర్యటింనున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా బీజేపీ యువజన సంఘాలు నిర్వహించే యువంఅనే సమావేశంలోనూ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మోడీకి బెదిరింపు లేఖ రావడంపై స్థానికంగా కలకలం రేపుతోంది. మరి ఈ విషయంపై ప్రధాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.. ఇక మోడీ కేరళ టూర్ విషయంలో వస్తే.. నరేంద్ర మోడీ 24వ తేదీన కొచ్చికి చేరుకోన్నారు. అక్కడ రోడ్షో నిర్వహించనున్నారు. అనంతరం యూత్ మీటింగ్కు హాజరకానున్నారు. 9 కీలక చర్చ్ ల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.