NTR: ఆ హీరోయిన్ కు ఫోన్ చేసి తారక్ సారీ చెప్పారా.. ఏం జరిగిందంటే?

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాల నటుడుగా ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోగా ఎంతో మంచి సక్సెస్ సాధించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లోకేషన్ తో సదరు నటీనటుల పట్ల చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని తెలుస్తుంది. ఇక ఈయన సెట్ లో ప్రతి ఒక్కరికి చాలా గౌరవం ఇస్తారని అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటారని ఇదివరకే ఎంతోమంది వెల్లడించారు.అయితే ఎన్టీఆర్ ఒక హీరోయిన్ పట్ల వ్యవహరించిన తీరుకు ఎంతో ఫీలయ్యారట.

హీరోయిన్ విషయంలో ఇలా చేసినందుకు ఈయన ఏకంగా ఆ హీరోయిన్ కి ఫోన్ చేసి మరి క్షమాపణలు చెప్పారట.ఇలా ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో హీరోయిన్ కి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పే అంత తప్పు ఏం చేశారు? అసలు ఆ హీరోయిన్ ఎవరు అనే విషయాలకు వస్తే…
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రియమణి మమతా మోహన్ దాస్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం యమదొంగ.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ సాధించింది. అయితే ఇందులో ఓలమ్మి తిక్క రేగిందా అనే పాట సూపర్ హిట్ అయింది.

 

ఇక ఈ పాటలో ఎన్టీఆర్ తరచూ మమతా మోహన్ దాస్ బ్యాక్ పై కొడుతూ ఉంటారు. అయితే డైరెక్టర్ చెప్పడంతోనే ఎన్టీఆర్ అలా చేశారని తెలుస్తోంది. కానీ తను అలా చేయటం వల్ల మమత మోహన్ దాస్ ఎక్కడ ఇబ్బంది పడ్డారో ఫీలయ్యారోనని ఎన్టీఆర్ స్వయంగా ఆమెకు ఫోన్ చేసి క్షమాపణలు తెలిపారట ఇలా ఎన్టీఆర్ హీరోయిన్ కి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారనే విషయం తెలిసి ఈయన వ్యక్తిత్వం ఎటువంటిదో అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -