Keerthy Suresh: కీర్తి సురేష్ దెబ్బకు చిరంజీవి డేట్ మార్చాలా.. ఏమైందంటే?

Keerthy Suresh: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు చిరంజీవి. ఆ తరువాత సినిమా అయినా భోళా శంకర్ ని కూడా అదే ఊపుతో పూర్తిచేసే పనిలో పడ్డారు చిరంజీవి.

మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించగా కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తోంది. తమిళం లో అజిత్ హీరోగా నటించిన వేదాళం కు ఈ సినిమా రీమేక్. అయితే ఈ సినిమాకి కీర్తి సురేష్ పెద్ద సమస్యగా మారిందని సమాచారం.

ఇంతకీ విషయం ఏమిటంటే సినిమా ఆగస్టు 11న సినిమా రిలీజ్ అంటూ డేట్ అనౌన్స్ చేశారు నిర్మాతలు. ఈ సినిమాకి 40 రోజులు చేయవలసిన పని మిగిలి ఉంది. అందుకే ఆ డేట్ కి సినిమా విడుదల ఉంటుందో లేదో అన్న అనుమానాలు అందరి మనసులోని రేకత్తున్నాయి.

అందుకు కారణం మెగాస్టార్ కాదని సమస్య అంతా కీర్తి సురేష్ వల్లనే అని అంటున్నారు సినీ వర్గీయులు. కీర్తి ఈ సినిమా చేస్తూనే మరో భాషలో ఒక సినిమాలో కీలక పాత్ర పోషించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం అందువల్ల ఆమెకి డేట్లు క్లాష్ వస్తున్నాయంట. బోండా శంకర్ సినిమాకి నిర్మాతగా అనిల్ సుంకర వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అక్కినేని మనవడు హీరో సుశాంత్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడు. బహుశా కీర్తిని ప్రేమించే వ్యక్తిగా కనిపించే అవకాశం ఉంది అంటున్నారు సినీ వర్గీయులు. ఈ సినిమాకి తిరుపతి మామిడాల డైలాగ్స్ అందించగా మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఒకవేళ ఇదే డేట్ కి భోళా శంకర్ రిలీజ్ కానట్లయితే ఆ డేట్ ని వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నారు సినీ హీరో రామ్.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -