CM Jagan Dharmana: సీఎం జగన్ పై ధర్మాన షాకింగ్ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?

CM Jagan Dharmana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల మధ్య పోరు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. అధికారపక్ష నాయకుల మీద ప్రతిపక్ష నాయకులు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. 2024 ఎలక్షన్లలో ఎలాగైనా అధికారం చేచిక్కించుకోవాలన్న ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వం ఒకవైపు జోరుగా ప్రచారం చేస్తూ అటు అధికార పార్టీ నాయకుల మీద విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రతిపక్ష నాయకులు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి తక్కువ చేసి మాట్లాడటం తప్పుగా మాట్లాడటం అందరికీ తెలిసిన విషయమే. ప్రతిపక్ష నాయకులు ఇలా మాట్లాడినా కూడా ప్రజలు పట్టించుకునేవారు కాదు. కానీ అధికార పక్షానికి చెందిన నాయకులకు కూడా జగన్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే ప్రజలు కూడా అదే నిజమని నమ్మే అవకాశాలు కూడా ఉన్నాయి.

 

కొందరు వైసిపి నాయకులు తమ నాయకుడి గురించి పొరపాటున అప్పుడప్పుడు నోరు జారుతూ ఉంటారు. వైసిపి మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిసి మాట్లాడతో తెలియక మాట్లాడతారో కానీ ఆయన శ్రీకాకుళంలో ఎప్పుడు ప్రసంగించినా ఆయన జగన్ ఇమేజ్ ను డామేజ్ చేయటానికి మాట్లాడుతున్నట్లు ఉంటుంది.

ఇటీవలి కాలంలో ఆయన ఓటర్లను బెదిరించేలా మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన ప్రజలు జగన్ ను సైకో, క్రాక్ అంటున్నారని మండిపడ్డారు.

 

సీఎం జగన్‌ను పిచ్చోడు, క్రాక్ అంటున్నారని .. మీకు ఇష్టముంటే ఓటేయండి లేకపోతే మానేయండి అంతే కానీ సీఎం జగన్ ను ఇలా అంటారా అని ప్రజల మీద మండిపడ్డాడు. జగన్ గారిని ప్రజలు పిచ్చోడు , క్రాక్ అని ఎప్పుడు అన్నారో.. మంత్రి గారు ఎప్పుడు విన్నారో కానీ.. ప్రజలలో జగన్ గురించి అదే అభిప్రాయం ఉందన్న విషయాన్ని మాత్రం బల్ల గుద్ది చెప్పినట్లయింది. ప్రస్తుతం ఈ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -