Telangana: బీసీ బంధు స్కీమ్ కు సంబంధించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

Telangana: దళిత బంధు పథకం ద్వారా దళితులకు 10 లక్షల రూపాయలను అతి కొద్ది మందికి మాత్రమే ఇచ్చి మిగిలిన వారికి అసంతృప్తిని మిగిల్చింది. అలాగే అయితే తాము వస్తేనే ఇస్తామని కాంగ్రెస్ వస్తే ఇవ్వరన్న ప్రచారాన్ని ప్రారంభించి వారి ఓట్లను దాటకుండా చూసుకుంటామన్న నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వాన్ని దళితులు నమ్ముతారో లేదో కానీ మాకేంటి అని ఇతర వర్గాలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాయి. ముఖ్యంగా బీసీ వర్గాలు. దీంతో వారి కోసం బీసీ బంధు పథకాన్ని తీసుకు రావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

చిన్న వ్యాపారాలు చేసేవారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా వంద శాతం సబ్సిడీతో నేరుగా ఆర్థికసాయం అందించే పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే రూ. పది లక్షలు ఇస్తారా లేకపోతే తక్కువ ఇస్తారా ఎక్కువ ఇస్తారా అన్నదానిపై స్పష్టత లేదు కానీ ఇవ్వడం మాత్రం ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దళితులపై దృష్టి పెట్టి బీసీలను దూరం చేసుకుంటున్నారన్న అభిప్రాయం పెరగడంతో ఈ స్కీమ్ కు రూపకల్పన చేశారు. ఇప్పటికే గొర్రెల పంపిణీ రెండో విడత జరగకపోవడం దగ్గర్నుంచి అనేక పథకాలు నత్తనడకన సాగుతున్నాయి.

 

అయితే వారిలో అసంతృప్తి బహిరంగంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో రైతు బంధు కేసీఆర్ కు మరో విజయాన్ని ఇచ్చింది. మూడో సారి విజయం సాధించాలంటే అంత తేలికైన విషయం కాదు. అందుకే ఈ సారి మరిన్ని స్కీమ్స్ కు కేసీఆర్ రూపకల్పన చేస్తున్నారు. కానీ ఇలా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి పథకాలు పెట్టడం వల్ల ఇతర వర్గాలు అసంతృప్తికి గురవుతున్నాయి. వారిని సంతృప్తి పరచడానికి మరో పథకం పెడుతున్నారు. నిజానికి కేసీఆర్ పెట్టే స్కీములన్నీ ప్రజలకు చేరవని ఓ పది మందికి ఇచ్చి ఆశ పెట్టి ఓట్లు పొందుతారని తర్వాత వదిలేస్తారని అంటున్నారు. దానికి దళిత బందు, డబుల్ బెడ్ రూం ఇళ్లే సాక్ష్యమనే ఆరోపణలు ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -