Adipurush: ఆదిపురుష్ పై అంచనాలు పెట్టుకుంటే కొంప కొల్లేరే.. ఏం జరిగిందంటే?

Adipurush: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా టీజర్ విమర్శల పాలవ్వడంతో సినిమా లోని కొన్ని సన్నివేశాలను మార్పులు చేర్పులు చేసి మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే అనేక కాంట్రవర్సీలు,విమర్శలు నెగిటివ్ కామెంట్స్ తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 16న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పోస్టర్లు పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాని విమర్శిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు ఇష్టపడుతున్న వారు కూడా అంతే మంది ఉన్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలకు చిత్ర బృందం ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకుంది..

మరొకవైపు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే సినిమా విడుదల అవుతుంది అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తుండగా ఇటువంటి సమయంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా గురించి ప్రభాస్ గురించి వేణు స్వామి స్పందిస్తూ.. ప్రభాస్ జాతకం బాగోలేదు ఆదిపురుష్ సినిమా యావరేజ్ గా ఉంటుంది ఆ సినిమాపై ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -