Mahesh Babu: ట్రెండింగ్ లో మహేష్ బాబు సర్కారు వారి పాట.. ఏం జరిగిందంటే?

Mahesh Babu: ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా పేరు మారుమోగుతూనే ఉంది. గడిచిన మూడు రోజులుగా ఈ సినిమా పేరు పాన్ ఇండియా లో వినిపిస్తూనే ఉంది. భారీ అంచనాల నడుమ విడుదలైన g సినిమా విడుదలైన మొదటి రోజే భారీ కలెక్షన్స్ సాధించింది. ఆదిపురుష్ మూవీ కలెక్షన్స్ తో మూవీ మేకర్స్ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తొలి వీకెండ్ గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర 340 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తూ పోస్టర్ విడుదల చేశారు.

 

దీంతో మహేష్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసిన మూడు రోజుల వసూళ్లను, మహేష్ సర్కారు వారి పాట కలెక్షన్స్ తో పోలుస్తూ చేస్తూ ప్రభాస్ అభిమానులను గిల్లడం మొదలు పెట్టారు. నాలుగో రోజు సర్కారు వారి పాట మార్నింగ్ షో కలెక్షన్స్, మ్యాట్నీ వసూళ్లు థియేటర్స్, ఏరియా వైస్ బయటికి తీస్తూ పాన్ ఇండియా మూవీ కాకుండా డైరెక్ట్ తెలుగు తెలుగు సినిమాతో నాన్ రాజమౌళితో మహేష్ రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టాడని పోస్టులు చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

దీంతో ఆదిపురుష్ సినిమా దెబ్బకి సర్కారు వారి పాట ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ఇకపోతే మహేష్ బాబు విషయం కాస్త ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఆ పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. ఇందులో మహేష్ బాబు సరోజన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నటించనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -