Chiranjeevi: మనవరాలి పోలికలపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

Chiranjeevi: మెగా ఇంట్లోకి మూడోతరం వారసురాలు అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. నేడు ఉదయం రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈ విషయం తెలిసే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు మనవరాలు పుట్టిందని విషయం తెలిసే చిరంజీవి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. రాత్రి హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ తన మనవరాలుని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

 

ఇక నేడు ఉదయం కూడా చిరంజీవి అపోలో హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ మీడియా ప్రతినిధులు చిరంజీవి గారిని అడ్డుకున్నారు. దీంతో మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి చిరంజీవి తన మనవరాలు గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఉపాసన రాంచరణ్ బిడ్డను మా చేతులలోకి తీసుకోవాలని ఆశపడ్డాము. అయితే భగవంతుడి ఆశీస్సులతో ఆ కోరిక నెరవేరిందని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.

ఆ భగవంతుడి ఆశీస్సులతో మాకెంతో ఇష్టమైనటువంటి మంగళవారం మా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టిందని మా మనవరాలు మాకు ఎంతో సంతోషాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఇక పాప మంగళవారం తెల్లవారుజామున 1:49లకు పుట్టిందని చాలా మంచి ఘడియలను కూడా పెద్దలు చెబుతున్నారని చిరంజీవి తెలిపారు. ఇక పాప మా జీవితాలలోకి సంతోషాన్ని తీసుకువచ్చిందని తెలిపారు.

 

ఇక మీడియా చిరంజీవి గారిని ప్రశ్నిస్తూ.. పాప ఎవరి పోలికలతో ఉండని అడిగారు. దీనికి చిరంజీవి సమాధానం చెబుతూ పాపని రాత్రి చూసాను తను ఎవరి పోలికలతో ఉందని చెప్పడం ప్రస్తుతం కష్టతరమని, ఇప్పుడే పోలికలు చెప్పడం కష్టమంటూ చిరంజీవి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -