Ramayana: మీకు బుర్ర ఉందా.. ఇలాంటి వాళ్లను అలాంటి రోల్స్ కు ఎంచుకుంటారా?

Ramayana: ప్రస్తుత కాలంలోని హీరోలందరూ కూడా భక్తి పారవశ్యంలో మునిగితేలుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరోలు అందరూ కూడా దేవుడి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇలాంటి దేవుడి పాత్రలలో నటించగా తాజాగా ప్రభాస్ సైతం ఏకంగా రాముడు పాత్రలో నటిస్తూ ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈయన రాముడి పాత్రలో నటించారు.

 

ఈ విధంగా ప్రభాస్ రాముడి పాత్రలో నటించడంతో త్వరలోనే మరో రామాయణం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే ఈ రామాయణంలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ నటి అలియా భట్ రాముడు సీత పాత్రలలో నటించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు నితిన్ తివారి దర్శకుడుగా వ్యవహరించబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విధంగా రామాయణం గురించి ఇందులో నటీనటుల గురించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ వార్తలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు బుర్ర ఉండి మాట్లాడుతున్నారా అలియా భట్ రణబీర్ కపూర్ సీతారాములుగా నటించడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం డబ్బు కోసమే ఇలాంటి సినిమాలను చేస్తూ రామాయణం వంటి ఒక గొప్ప కావ్యాన్ని అవమానిస్తున్నారని మండిపడుతున్నారు.

 

ఒకానొక సందర్భంలో రణబీర్ కపూర్ మాట్లాడుతూ తాను బీఫ్ తింటానని చెప్పేశారు.అలాగే అలియా భట్ సినిమాలలో నటిస్తూ గంగుబాయ్ కథియవాడి సినిమాలో వేశ్య పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఇలా బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్రలో నటించడం వేశ్య పాత్రలలో నటించే నటి సీత పాత్రలో నటించడం ఏంటి అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.అసలు బుర్ర అనేది ఉంటే ఇలాంటి పాత్రలకు ఈ విధమైనటువంటి హీరో హీరోయిన్లను ఎంచుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -