Salaar: సలార్ స్టోరీ లీక్.. ఇలా ప్లాన్ చేశావేంటి నాయన!

Salaar: పాన్ ఇండియా స్టార్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ప్రభాస్ తాజాగా ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదల అయ్యే మిశ్రమ స్పందన అందుకుంది. ఇక ఈ సినిమా విడుదల కావడంతో ప్రభాస్ తన తదుపరిచిత్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారు.

 

ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ వారంలో ఎప్పుడైనా టీజర్ రిలీజ్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.

కే జి ఎఫ్ సినిమాతో సంచలనాలను సృష్టించినటువంటి ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కే జి ఎఫ్ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా స్నేహితుడి సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

 

ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర స్నేహితుడిని చంపే విధంగా ఉండబోతుందని సమాచారం.స్నేహితుడి కోసం ప్రాణాలు తీసుకోవడం కన్నా ప్రాణాలు తీయడమే మంచిదన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ ఎంపిక చేసుకున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి ఈ సినిమా ఏ విధమైనటువంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -