Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Chiranjeevi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సతీమణి ఉపాసన ఇటీవలే తల్లిదండ్రులైన విషయం మనందరికీ తెలిసిందే. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక అప్పటినుంచి ఈ జంటకు, మెగా ప్రిన్సెస్ కు సంబంధించి నిత్యం ఏదో ఒక రకమైన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత మెగా ఇంటికి వారసురాలు రావడంతో మెగా ఇంట్లో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా చిరంజీవి మనవరాలు పుట్టింది అన్న ఆనందంలో చాలా సంతోషంగా ఉన్నారు.

ప్రస్తుతం చిరంజీవి ఇంట్లోనే అందరూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఇన్నాళ్లకు మనవరాలు పుట్టిన శుభ సందర్భంగా చిరంజీవి ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారట. సినీ ప్రముఖులు,రాజకీయ ప్రముఖులతో, పాటు కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులు అందరూ ఈ పార్టీకి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ రోజే పాప పేరు కూడా రిలీజ్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈలోపే చిరంజీవి ఆస్ట్రాలజర్ వేణు స్వామిని ఇంటికి పిలిపించి తన మనవరాలి జాతకం ఎలా ఉండబోతుంది? ఎలాంటి పూజలు చేయాలి? అన్నదానిపై చర్చించబోతున్నారట.

 

ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు చెర్రీ అభిమానులు గ్లోబల్ స్టార్ కూతురు అంటే ఆ మాత్రం ఉండాలి మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైరల్ గా మారింది. మొదటి నుంచి ఉపాసన చరణ్ జాతకాన్ని తూచా తప్పకుండా చెప్పేసిన వేణు స్వామి మెగా మనవరాలు విషయంలో ఏం చెప్తాడు? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -