Vijay Sai Reddy: సొంత మరదలిపై వేధింపులు.. ఇలాంటి వ్యక్తి పిల్లలకు నీతులు చెబుతారా?

Vijay Sai Reddy: మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణ పై ఆయన మరదలు ప్రియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ముందు నవ్వుతూనే తన బాధని చెప్పుకోవడం మొదలుపెట్టిన ప్రియ కన్నీటితో తన వీడియో ముగించింది. అయితే ఈ వీడియోలో తనకి సంబంధం కుదిరిన దగ్గర నుంచి తను వీడియో పెట్టడానికి ముందు రోజు వరకు జరిగిన ప్రతి విషయాన్ని చెప్పకు వచ్చింది ప్రియ.

డేగ లాంటి అతను పిట్ట లాంటి నాపై కన్నేసాడు. అప్పటికే అతను ఇద్దరి భార్యలతో సంసారం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతని భార్యలు కాకుండా అతనికి టిఫిన్ పెట్టడం దగ్గర నుంచి టీ ఇవ్వటం వరకు అన్ని నన్నే చెయ్యమనేవాడు. చిన్న వయసులోనే పెళ్లి అవటంతో అంతగా తెలిసేది కాదు. పుట్టింట్లో కూడా చెప్పుకోలేదు. ఒక రోజు అన్నం తీసుకు రాలేదని నన్ను కొట్టడం కూడా జరిగింది అంటూ తన బావపై విమర్శలు చేసింది ప్రియ.

 

అలాగే గత ఎన్నికలలో తనని తెలుగుదేశం తరఫున ప్రచారం చేయమని కూడా టార్చర్ పెట్టినట్లు ప్రియా చెప్పుకొచ్చింది. అయితే సదరు నారాయణ టిడిపి అధినేత చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడు గత క్యాబినెట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఒక వెలుగు వెలిగారు. అలాంటి నారాయణ వ్యవహారంపై విజయ్ సాయి రెడ్డి వారి వరుసలు లేకుండా సొంత కుటుంబ సభ్యులనే కాదు ప్రజలని ఆఖరికి తన సంస్థలో పనిచేసే మహిళ ఉద్యోగులని కూడా వేధిస్తున్నారు.

 

గద్దలనీ, కోడి పిల్లలని తన్నుకు పోవడానికి పైనుంచి గురి చూసినట్లే అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి పిల్లలకి నీతులు చెబుతారా.. నారాయణ! నారాయణ! నారాయణ! అంటూ ఒక ట్వీట్ ని వదిలారు. అయితే అధికారాన్ని చేతిలో పెట్టుకొని కేవలం ఆరోపణలకే పరిమితం కావటం ఏంటి అంటూ ప్రత్యర్ధులు ప్రశ్నిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఎవరికైనా ఒక హెచ్చరిక లాగా ఉంటుంది అంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -