Hyderabad: భార్యను వేధిస్తున్నాడని తమ్ముడిని దారుణంగా నరికి చంపిన అన్న.. ఏం జరిగిందంటే?

Hyderabad:  ప్రస్తుత రోజుల్లో స్త్రీలకు రక్షణ అన్నది కరువైంది. ఇంకా బయట ఎక్కడా కూడా స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. కట్టుకున్న భర్త నుంచి కన్న తండ్రి తోడబుట్టిన అన్న ఇలా ప్రతి ఒక్కరు కూడా స్త్రీల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కన్న కూతురిపై అత్యాచారం చేయడం తోడబుట్టిన చెల్లిపై అత్యాచారం చేయడం చంపడం లాంటి ఘటనలు ఇప్పటికే ఘటనలు వెలుగు లోకి వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోతోంది.

ప్రభుత్వం ఏమీ చేయలేదు అన్న ధీమాతో తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్తున్నారు. తాజాగా కూడా ఒక మహిళను భర్త అన్న అనగా బావ హింసిస్తూ తప్పుగా ప్రవర్తించడంతో తమ్ముడు అన్నకు సరైన శిక్ష విధించాడు. అసలేం జరిగిందంటే.. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ఘటన హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని బసవతారకనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భార్యను వేధిస్తున్నాడనే అనుమానంతో తమ్ముడు సాజిద్‌ను అన్న షబ్బీర్‌ అహ్మద్‌ దారుణంగా నరికి చంపాడు. అనంతరం పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. సాజిద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు షబ్బీర్‌ అహ్మద్‌ను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -