Bigg Boss 7 Telugu: అతి తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకే బిగ్ బాస్ హౌస్ లో రీఎంట్రీ.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎన్ని ట్విస్టులతో, ఊహించని మలుపులతో వెళ్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటివరకు జరిగిన అన్ని బిగ్ బాస్ సీజన్ ల కన్నా భిన్నంగా ఈ సీజన్ ఉల్టా పల్టాగా నడుస్తుంది. ఎప్పుడైనా ఎవరో ఒకరు ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ తో వస్తారు కానీ ఈసారి ఏకంగా ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లతో అడుగుపెడుతున్నారు.

వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో వచ్చిన వాళ్ళు ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లే వస్తారు కానీ ఈసారి అందరూ కొత్తగా వచ్చారు. అలాగే ఎలిమినేట్ అయిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా బిగ్ బాస్ నిర్ణయించి పంపిస్తాడు కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే దాన్ని ఇంట్లో ఉన్న ఇతర హౌస్ మెట్సే ఎంచుకోవాలట. ఎవరికీ ఎక్కువ ఓట్లు కోస్తే వాళ్లే ఇంట్లోకి వస్తారు అని మీరు అనుకుంటే మీరు పొరబడుతున్నారు.

ఎందుకంటే అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇంట్లోకి రియంట్రి ఇస్తారట. అది కూడా ఒకలికే అవకాశం ఉందట. కనీసం మూడు నాలుగు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఎలిమినేట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. అంటే రతిక, శుభ శ్రీ దామినీలకు మాత్రమే ఈ అవకాశం ఉన్నది. అయితే శుభ శ్రీ కి, దామినికి ఇంట్లో మంచి ఫ్రెండ్సే ఉన్నారు.

కానీ రతికాకి మాత్రం ఫ్రెండ్స్ తక్కువ. బహుశా తననే తిరిగి వైల్డ్ కార్డు ఎంట్రీ తో లోపలికి పిలుస్తారేమో. ఎవరు వస్తారు అనేది తెలియాలంటే ఇంకొంచెం సేపు వేసి చూడాల్సి ఉంది. ఒకవేళ రతిక వచ్చినట్టయితే ఇప్పటికే తన మీద చాలా నెగటివ్ టాక్ అనేది సోషల్ మీడియాలో నడుస్తుంది కనుక వచ్చినా ఇంకొక రెండు మూడు వారాలలో వెళ్లిపోవడం ఖాయం అనే అంటున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -