Harish Rao: ఏపీలో పనితనం లేదు పగతనం ఉంది.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Harish Rao: చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అందరూ చంద్రబాబుపై సానుభూతి వ్యక్తం చేస్తే కొందరు మాత్రం మౌనం వహించారు. అయితే చంద్రబాబు అరెస్టు అయినప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రాలలో కాక పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్టు బిగ్ ఇష్యూ అయింది. చంద్రబాబు అరెస్టుపై కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని రకాల పార్టీల నేతలు స్పందించారు. బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ అయితే అసలు స్పందించలేదు.

కానీ బీఆర్ఎస్ లో మిగతా మంత్రులు ఈ అంశంపై స్పందించి ఏపీ ప్రభుత్వం తీరుని తప్పుపట్టారు. ఇక ఈ విషయంలో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని తప్పు పడుతూనే ఉన్నారు. మూడు వారాల క్రితం స్పందించిన ఆయన చంద్రబాబుని అరెస్టు చేసి ఉండకూడదు అని చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే చంద్రబాబుని అరెస్టు చేసి జైల్లో పెట్టడం ముమ్మాటికీ తప్పు ఇది పూర్తిగా బీజేపీ వైసీపీ ల కుట్ర అని బాహాటంగానే విమర్శించారు.

అయితే ఇప్పుడు హరీష్ రావు మరొకసారి తన స్పందన తెలియజేస్తూ చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అసలు పనితనం లేదు కేవలంపగతనం మాత్రమే ఉంది అంటూ సెటైర్లు వేశారు. ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా కేసీఆర్ పగబడితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైల్లో ఉండే వారని కానీ తాము ఎవరిమీద పగ పట్టమని..

అలాగే ఎవరిమీద ఆ కారణమైన ద్వేషాన్ని పెంచుకోమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు హరీష్ రావు ఎందుకు ఇంత సానుకూలంగా చంద్రబాబు వైపు మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు సానుభూతిపరుల ఓట్లు బీఆర్ఎస్ కి ఇప్పుడు అవసరం. అందుకే వైసీపీ ప్రభుత్వ వైఖరిని, వారి పాలనను ఎత్తి చూపిస్తున్నారు హరీష్ రావు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -