Dulquer Salmaan: సీతారామం సీక్వెల్ గురించి ఆ విధంగా స్పందించిన దుల్కర్ సల్మాన్!

Dulquer Salmaan: టాలీవుడ్ లో ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్న సీతారామం సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందమైన ప్రేమ కథలో రామ్ గా దుల్కర్ సల్మాన్ నటించాడు. ఇక సీతామహాలక్ష్మి గా మృనాల్ ఠాకూర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.

ఇక రష్మిక, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. హను రాఘవపూడి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఈ సినిమాకు.. భారీ స్థాయిలో ప్రేక్షక ఆధారణ దక్కింది. ఊహించిన విధంగానే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మరి ఇదంతా పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్ సినిమాల హవా బాగా నడుస్తుంది. ఏదైనా సినిమా మంచి హిట్ దక్కించుకుంటే చాలు ఆ సినిమా సీక్వెల్ తీయాలని కొందరు ఆసక్తి చూపుతూ ఉంటారు.

మరి అదేవిధంగా ఇప్పుడు సీతారామం సినిమాను కూడా కొనసాగింపు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఓ విలేఖరి ఇదే ప్రశ్నను దుల్కర్ సల్మాన్ ను అడిగారు. దీని గురించి దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ఏదైనా సినిమాకు మంచి ఆదరణ దక్కితే, క్లాసిక్ గా ఉంటే నేను దాన్ని మళ్ళీ టచ్ చేయకూడదని నటుడుని కాకముందే తెలుసుకున్న.. మేము ఈ కథని బాగా నమ్మాము.. అనుకున్న విధంగానే ఈ సినిమా క్లాసిక్ గా నిలిచింది.

అందుకే ఈ సినిమా విషయంలో కొనసాగింపు చేయకూడదనుకుంటున్నానని అన్నాడు. ఇక రీమేక్ విషయంలో కూడా అంతే అని దుల్కర్ తన అభిప్రాయాన్ని బయట పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ లో కూడా విడుదలై అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెగ హడావిడి చేస్తుంది. ఏదైనా ఈ సినిమా దుల్కర్ కు భారీ స్థాయిలో విజయాన్ని తెచ్చిపెట్టింది. వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకు కూడా స్టోరీ పరంగా బాగా కనెక్ట్ అయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -