Allu Aravind-Mrunal Thakur: లావణ్య త్రిపాఠి,వరుణ్ తేజ్ ల పెళ్లి రేపు అనగా నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా జరగనున్న విషయం తెలిసిందే. అయితే లావణ్య త్రిపాఠీ పెళ్లి విషయం వచ్చిన ప్రతిసారి అల్లు అరవింద్ పేరు తప్పకుండా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక వేడుకలో భాగంగా అల్లు అరవింద్ లావణ్యను తెలుగింట కోడలైతే బాగుంటుందనే ముందుగానే గెస్ చేసారు. అందుకే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్లో స్థిరపడితే బాగుంటుందనే జోస్యం చెప్పారు.
అయితే లావణ్య త్రిపాఠి అల్లు అరవింద్ చెప్పిన వాఖ్యలను నిజం చేస్తూ ఏకంగా మెగా ఇంటికి కోడలు కాబోతోంది. ఇకపై వరుస పెట్టి అల్లు అరవింద్ ని లావణ్య పిలబోతుంది. అయితే సరిగ్గా ఇలాగే ముంబై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని కూడా అరవింద్ సార్ బ్లెస్ చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023 సైమా అవార్డు వేడుకల్లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గతంలో ఒక హీరోయిన్ ని హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుని తెలుగింట కోడలిగా రమ్మని బ్లెస్ చేసాను. ఆ తర్వాత ఆమె తెలుగు హీరోతో ప్రేమలో పడింది. త్వరలో పెళ్లి చేసుకుంటోంది. ఇప్పుడు నిన్ను కూడా బ్లెస్ చేస్తున్నాను. నువ్వు కూడా ఇక్కడికి తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నా అని నవ్వేసారు.
క్రిటిక్స్ విభాగంలో మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రానికి గాను మృణాల్ అవార్డు అందుకుంది. అల్లు అరవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డు తీసుకుంది. ఈ సందర్భంగానే అరవింద్ ఆ వ్యాఖ్యలు చేసారు. మరి ఆయన వ్యాఖ్యలు ఫలించి తెలుగు అబ్బాయిని మృణాల్ పెళ్లి చేసుకుంటే సరి. అయితే మృనాల్ ఠాకూర్ అల్లు అరవింద్ చేసిన వాఖ్యలను నిజం చేస్తుందా. లావణ్య లాగే తను కూడా మెగా హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకోనుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే మృనాల్ ఠాకూర్ మెగా హీరోలలో ఎవరిని ప్రేమిస్తోంది అన్నా వార్త ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.