Mahesh-Rajamouli: ఆ ఒక్క సమస్య వల్లే మహేష్ రాజమౌళి మూవీ ఆలస్యమవుతోందా?

Mahesh-Rajamouli: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలోనే రాజమౌళి సినిమా పనులలో బిజీ కానున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయి. అదేవిధంగా టెక్నికల్ టీం అందరూ కూడా సెట్ అయ్యారు ఇదివరకే టెక్నికల్ టీం కి సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయగా, సినిమాటోగ్రాఫర్ గా పి ఎస్ వినోద్, వి ఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ గా కమల్ కణ్ణన్, ప్రొడక్షన్ డిజైనర్ గా మోహన్ బింగ, ఎడిటర్ గా తమ్మి రాజు ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇక కాస్ట్యూమ్ డిజైనర్ గా రాజమౌళి సతీమణి రమ రాజమౌళి నిర్వహించబోతున్నారు.

ఇప్పటికే టెక్నికల్ టీం మొత్తం ఖరారు అయ్యారని త్వరలోనే వీరికి సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. ఇక స్క్రిప్ట్ పనులన్నీ కూడా విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేసి తన కుమారుడు రాజమౌళి చేతిలో పెట్టారు. మరోవైపు మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఇలా టెక్నికల్ గా అందరూ సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడమే ఆలస్యమని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్గా బాలీవుడ్ నటి నటించబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజిబెత్ ఇస్లాన్ నటించబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈమె ఇంస్టాగ్రామ్ లో రాజమౌళి ఫాలో కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని లోకేషన్లను పరిశీలించారని అందుకు దగ్గర అనుమతుల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -